మాది ఫుల్ లోడ్ బండి: తలసాని
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో వరదలు వచ్చిన నెలరోజుల తర్వాత బృందాన్ని పంపిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. కేంద్రబృందం...
104 స్థానాల్లో విజయం సాధిస్తామన్న మంత్రి
ఒత్తిడితెచ్చి వరదసాయం నిలిపివేశారని వ్యాఖ్య
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో వరదలు వచ్చిన నెలరోజుల తర్వాత బృందాన్ని పంపిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. కేంద్రబృందం వచ్చినా దమ్మిడీ కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. నగరంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల ఆర్థికసాయం ప్రకటించిందని చెప్పారు. ఆర్థిక సాయం కోసం ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించామని.. అర్హులందరికీ సాయం అందించాలనే ఆవిధంగా చేశామని చెప్పారు. ఇప్పటివరకు నేరుగా 4,75,781 మంది బాధితులకు సాయం అందజేశామన్నారు. మూడు రోజుల్లో 1.65లక్షల దరఖాస్తులు వచ్చాయని.. ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో రూ.165కోట్లు జమ చేశామని తలసాని వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వరద సాయం నిలిపివేయించారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సాయం అందజేయనున్నట్లు సీఎం చెప్పారని స్పష్టం చేశారు.
ప్రధాన పోటీ కాంగ్రెస్తోనే..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని తలసాని స్పష్టం చేశారు. ప్రజలకు కాంగ్రెస్, భాజపా ఏం చేశాయో చెప్పాలని ఆయన నిలదీశారు. ఆ రెండు పార్టీలకు 75 స్థానాలకూ అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కిషన్రెడ్డి కేంద్రమంత్రి అయిన తర్వాత ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయని.. సుమారు రూ.70వేల కోట్లతో హైదరాబాద్లో అభివృద్ధి పనులు చేపట్టామని తలసాని వివరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఒక్కరోజులో పూర్తికావని.. ఆలస్యమైనా వాటిని పూర్తిచేసి పేదలకు అందిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కొందరికి తప్ప సిట్టింగులు అందరికీ అవకాశముంటుందని స్పష్టం చేశారు. తమది ఫుల్ లోడ్ బండి అని ఈ సందర్భంగా తలసాని వ్యాఖ్యానించారు. 150 డివిజన్లలోనూ పోటీచేసి.. 104 సీట్లలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్తోనే ఉంటుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..