Bihar: బల పరీక్షలో నీతీశ్ విజయం.. విపక్షం వాకౌట్
బిహార్ అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో నీతీశ్ కుమార్ నెగ్గారు. 129 మంది ఎమ్మెల్యేలు ఆయన ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar) అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్ష (Trust Vote)లో మొత్తం 129 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచారు. విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 122.
అంతకుముందు ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సైతం 125- 112 ఓట్లతో నెగ్గింది. ఆ సమయంలో ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్డీయే పక్షం వైపు కూర్చోవడంపై తేజస్వీ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తగా.. డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ తిరస్కరించారు. త్వరలోనే నూతన స్పీకర్ను ఎన్నుకునే అవకాశం ఉంది.
నీతీశ్ కుమార్ను తాను ఎప్పుడూ తండ్రిలాగే భావించానని, ‘మహాగఠ్బంధన్’ నుంచి వైదొలిగి ఎన్డీయేలోకి తిరిగి చేరేందుకు ఆయన్ను ఏ కారణాలు బలవంతం చేశాయో తనకు తెలియదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బిహార్లోని మహాకూటమి ప్రభుత్వాన్ని చూసి భాజపా భయపడింది. నీతీశ్ మరోసారి కూటమి మారబోరని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వగలరా?’’ అని ప్రశ్నించారు.
జేడీయూ అధినేత నీతీశ్కుమార్ గత నెల 28న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్జేడీతో కలిసి ఆయన ఏర్పాటుచేసిన మహాకూటమి ప్రభుత్వం పతనమైంది. అనంతరం భాజపాతో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అదేరోజు ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. నేడు బలపరీక్షలో నెగ్గారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం