Pawan Kalyan: మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. సీఎం జగన్ను: పవన్ కల్యాణ్
మార్పు తీసుకొస్తాం.. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపుతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
నెల్లిమర్ల: మార్పు తీసుకొస్తాం.. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపిస్తాం.. అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవకర్గం పోలిపల్లిలో నిర్వహించిన ‘యువగళం-నవశకం’ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు.
జగన్ మాదిరి బుగ్గలు నిమిరే యాత్ర కాదు..
‘‘యువగళం పాదయాత్ర.. జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదు. ప్రజల బాధలు తెలుసుకున్న పాదయాత్ర. ఇలాంటి పాదయాత్రల వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవచ్చు. నాకు రాని అవకాశాన్ని లోకేశ్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారత దేశానికి చాలా కీలకం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే. భారతదేశానికే స్ఫూర్తినిచ్చిన నేల ఇది. ఐఏఎస్లు, ఐపీఎస్లు గతంలో ఏపీకి రావాలని ఉవ్విళ్లూరేవాళ్లు. ఏపీ ఒక మోడల్ స్టేట్ అని అక్కడికి వెళ్లాలని చెప్పేవారు. కానీ, ఇప్పుడు.. ఏపీకి ఎందుకు వెళ్లకూడదో చెబుతున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగింది. ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతివ్వలేదు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నావంతు సాయంగా ఉండాలనే మద్దతిచ్చా.
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ పక్షానికి కీలక బాధ్యతలు వహించిన వ్యక్తిని జైల్లో పెట్టడం చాలా బాధ కలిగించింది. జగన్ చేసిన తప్పులకు సోనియాగాంధీ.. అతన్ని జైల్లో పెట్టించారు. ఆ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టించడం దారుణం. మనకు రాజధాని లేకుండా, సరైన పంపకాల్లేకుండా విభజన జరిగిన కష్ట సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా తెదేపాకు మద్దతిచ్చా. 2024లో తెదేపా-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మార్పు తీసుకొస్తున్నాం.. జగన్ను ఇంటికి పంపించేస్తున్నాం. జగన్ 80 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారని వింటున్నాం. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ను.
ప్రజాస్వామ్యం అనే పదానికి జగన్కు విలువ తెలియదు. ఏదైనా మాట్లాడితే దూషిస్తారు.. దాడులు చేస్తారు. మహిళను కించపర్చే సంస్కృతికి వైకాపా శ్రీకారం చుట్టింది. ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని సీఎం జగన్.. మహిళలకు ఏం విలువ ఇస్తారు. ఒంటరి మహిళలు అన్యాయాలకు గురవుతున్నారు. మరోసారి వైకాపా ప్రభుత్వం వస్తే నాతో సహా అంతా.. వైకాపా గూండాలను ఎదుర్కోవటానికి కర్రో, కత్తో పట్టుకోవాల్సి వస్తుందని కేంద్రంలోని పెద్దలకు చెప్పాను. తెదేపాతో పొత్తు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వివరించా. కేంద్రంలోని భాజపా పెద్దల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా. పొత్తు సాధ్యమైనంత ఎక్కువకాలం.. ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకునే వరకు ఉండాలి. భవిష్యత్తులో తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం. తెలుగుదేశం-జనసేన మైత్రి.. స్ఫూర్తిని చాలా సంవత్సరాలు కాపాడుకోవాలని ఆశిస్తున్నా’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు