Somu Veerraju: అమిత్‌షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన ఊహించుకుంటారా?: సోమువీర్రాజు

నాలుగేళ్లలో వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు.

Updated : 24 Jun 2023 14:04 IST

విజయవాడ: నాలుగేళ్లలో వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఏపీకి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అవసరమన్నారు. తెలుగుదేశంతో భాజపా పొత్తు పెట్టుకుంటుందని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

‘‘అమిత్‌షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన ఊహించుకుంటారా? వారి ఇద్దరి మధ్య భేటీని ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు అన్వయించుకుంటున్నారు. అమిత్‌షాతో భేటీ తర్వాత దానిపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు. రాష్ట్రానికి  డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కావాలనేది నా ఆకాంక్ష. మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమం అందరికీ కనిపిస్తోంది. వైకాపా ఏం చేసిందో ప్రజలకు కూడా తెలుసు’’ అని సోమువీర్రాజు ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని