దీపన్ ప్రచారంలో మెరిసెన్..
ప్రజల జీవితంలో భాగంగా మారిన సామాజిక మాధ్యమాలు ఎన్నికల ప్రచారాలకు వేదికగా మారుతున్నాయి. భారీ మైకులు, పెద్దపెద్ద ప్రచార సాధనాలతో పనిలేకుండా డిజిటల్ ప్రచారంతో ఓ యువకుడు దూసుకుపోతున్నాడు. తనకు తెలిసిన సాంకేతికతను వినియోగించుకొని...
సామాజిక మాధ్యమాలే వేదికగా యువ అభ్యర్థి ప్రచారం
చెన్నై: ప్రజల జీవితంలో భాగంగా మారిన సామాజిక మాధ్యమాలు ఎన్నికల ప్రచారాలకు వేదికగా మారుతున్నాయి. భారీ మైకులు, పెద్దపెద్ద ప్రచార సాధనాలతో పనిలేకుండా డిజిటల్ ప్రచారంతో ఓ యువకుడు దూసుకుపోతున్నాడు. తనకు తెలిసిన సాంకేతికతను వినియోగించుకొని డిజిటల్ మాధ్యమంలోనే ప్రచారం చేస్తూ తమిళ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు యూట్యూబర్ దీపన్ చక్రవర్తి. తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో దీపన్ చక్రవర్తి నమక్కల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే విస్త్రృత ప్రచారానికి కావాల్సినంత డబ్బు లేకపోవడంతో సామాజిక మాధ్యమాలనే ఉపయోగించుకుంటూ యువ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
తొలుత రిపోర్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దీపన్ ‘చెన్నై వ్లాగర్ దీపన్’ పేరుతో రోజూ యూట్యూబ్లో వీడియోలు పోస్టు చేసేవారు. అలా తమిళ యువతకు దగ్గరైన దీపన్.. తన అనుభవాన్ని, యువతలో తనకున్న క్రేజ్ను ఎన్నికల ప్రచారంలోనూ వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేయడం మొదలు, ఎన్నికల గుర్తును ప్రచారం చేయడం ఇలా ప్రతి అంశాన్ని వీడియో తీసి తన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. యువతకు తన సిద్ధాంతాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు యువత, ప్రజలకు అందించేందుకు ‘ఐ దీపన్ ఆన్ ఎమ్మెల్యే’ అనే వెబ్ పేజీని కూడా రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్