Ayyanna: విజయసాయికి రూ.300 కోట్ల భూమి గిఫ్ట్గా ఇచ్చేందుకు జగన్ యత్నం: అయ్యన్న
విశాఖలోని భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
విశాఖ: విశాఖలోని భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తుర్లవాడ ఆధ్యాత్మిక క్షేత్రమని.. దీని జోలికి రావొద్దన్నారు. విజయసాయిరెడ్డి తన కుమార్తె విద్యాసంస్థల నిర్మాణం కోసం ఇక్కడ 120 ఎకరాలు కేటాయించాలని సీఎం జగన్ను కోరారన్నారు. రూ.300 కోట్ల విలువైన ఈ భూమిని విజయసాయిరెడ్డికి బహుమతిగా ఇవ్వడానికి సీఎం యత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రజల ఆస్తిని జగన్రెడ్డి ఇష్టమొచ్చినట్లుగా దానం చేస్తున్నారని అయ్యన్న దుయ్యబట్టారు. కొండపై 120 అడుగుల నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని స్థానికులు తెదేపాని కోరుతున్నారన్నారు. ఇప్పటికే తితిదే, సింహాచలం ఆస్తులు దోచేశారని ఆరోపించారు. దేవుడిని టచ్ చేయవద్దని జగన్ రెడ్డిని కోరుతున్నామన్నారు. ఇప్పటికే విశాఖలో జగన్ రెడ్డి అండ్ కో.. రూ.70 వేల కోట్ల ఆస్తులు దోచుకున్నారన్నారు. రుషికొండపై మంత్రి రోజా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖలో దోపిడీపై సీనియర్ నేతలు బొత్స, ధర్మాన ఎందుకు మాట్లాడటం లేదని అయ్యన్న నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య