Atchannaidu: చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారనే అనుమానం ఉంది: అచ్చెన్న
రాష్ట్రంలోని పరిణామాలను గమనిస్తున్నట్లు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చెప్పారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు అన్నారు.
విశాఖపట్నం: రాష్ట్రంలోని పరిణామాలను గమనిస్తున్నట్లు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చెప్పారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ పోర్టు గెస్ట్హౌస్లో అచ్చెన్న నేతృత్వంలో తెదేపా నేతలు గవర్నర్ను కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అనంతరం జరిగిన పరిణామాలు, ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిణామాలపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. తనకు కూడా తెలియకుండా అరెస్టు చేసినట్లు గవర్నర్ తెలిపారని అచ్చెన్న చెప్పారు.
AP CID: ప్రెస్మీట్లో ఒక మాట.. రిమాండు రిపోర్టులో మరో పాట
వైకాపా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది
‘‘రాజకీయ కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. నాలుగేళ్ల పాలనలో అవినీతి కనిపించలేదా.. ఇప్పుడే ఎందుకు తెలిసింది. తెదేపా ఒంటరిగా పోటీ చేసినా 15 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. జనసేనతో కలిసి పోటీచేస్తే వైకాపా చిరునామా గల్లంతవుతుందని సర్వేలు చెబుతున్నాయి. వైకాపా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఐప్యాక్ సర్వేలో తేలింది. లోకేష్ పాదయాత్రను అణచివేయాలని యత్నించారు. కావాలని చంద్రబాబును జైలుకు పంపడం దారుణం. 48 గంటల పాటు రోడ్లపై తిప్పి సైకో ఆనందం పొందారు. చంద్రబాబు మనో ధైర్యాన్ని ఎప్పటికీ తొలగించలేరు. తెదేపాకు సంక్షోభాలు కొత్తకాదు. సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని ముందుకెళ్తాం. ఈ కేసుతో తెదేపా నేతలకు సంబంధం ఏంటి? తప్పుడు ఆలోచన గల వ్యక్తులు ఉన్న ప్రభుత్వం ఇది. చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారనే అనుమానం ఉంది’’ అని అచ్చెన్న వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!