TDP: విజయవాడ ఎంపీ టికెట్‌ వేరే వ్యక్తికి.. కేశినేని నానికి తెలిపిన తెదేపా

రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్‌ను వేరే వ్యక్తికి ఇవ్వాలని తెదేపా(TDP) నిర్ణయించింది. ప్రస్తుత ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)కి ఆ సమాచారాన్ని పార్టీ అధిష్ఠానం చేరవేసింది.

Updated : 05 Jan 2024 20:09 IST

విజయవాడ: రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్‌ను వేరే వ్యక్తికి ఇవ్వాలని తెదేపా(TDP) నిర్ణయించింది. ప్రస్తుత ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)కి ఆ సమాచారాన్ని పార్టీ అధిష్ఠానం చేరవేసింది. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానని తెలిపారు. 

‘‘అందరికీ నమస్కారం. గురువారం సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్‌ జిల్లా తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నన్ను కలిశారు. ఈనెల 7న తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించినందున ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్లు వారు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ అభ్యర్థిగా నా స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని.. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. అధినేత ఆజ్ఞలను తు.చ. తప్పకుండా శిరసావహిస్తానని నేను వారికి హామీ ఇచ్చా’’ అని కేశినేని నాని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని