Chandrababu: జగన్‌ను ఆ పదవి నుంచి పీకడానికి ప్రజలు సిద్ధం: చంద్రబాబు

రాష్ట్రంలో కరెంట్ పీకుతున్న సీఎం జగన్‌ను ఆ పదవి నుంచి పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 09 Apr 2022 13:50 IST

అమరావతి: రాష్ట్రంలో కరెంట్ పీకుతున్న సీఎం జగన్‌ను ఆ పదవి నుంచి పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విద్యుత్‌ కోతలు, పెరిగిన కరెంట్‌ ఛార్జీలపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పారు. పరిశ్రమలకు విద్యుత్‌ కోతలతో కార్మికుల ఉపాధి పోతోందని, పంటలకు నీరందక రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తెదేపా పిలుపునిచ్చిన బాదుడే బాదుడు కార్యక్రమంపై చంద్రబాబు ఆన్‌లైన్‌ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి కొవ్వొత్తి, అగ్గిపెట్టె, బాదుడే బాదుడు కరపత్రం పంపిణీ చేస్తున్నారని.. రాష్ట్రంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకు వెనకాడేది లేదని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబుతో పాటు లోకేశ్‌, అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు