Chandrababu: జగన్ను ఆ పదవి నుంచి పీకడానికి ప్రజలు సిద్ధం: చంద్రబాబు
రాష్ట్రంలో కరెంట్ పీకుతున్న సీఎం జగన్ను ఆ పదవి నుంచి పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
అమరావతి: రాష్ట్రంలో కరెంట్ పీకుతున్న సీఎం జగన్ను ఆ పదవి నుంచి పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ ఛార్జీలపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలతో కార్మికుల ఉపాధి పోతోందని, పంటలకు నీరందక రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తెదేపా పిలుపునిచ్చిన బాదుడే బాదుడు కార్యక్రమంపై చంద్రబాబు ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి కొవ్వొత్తి, అగ్గిపెట్టె, బాదుడే బాదుడు కరపత్రం పంపిణీ చేస్తున్నారని.. రాష్ట్రంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకు వెనకాడేది లేదని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబుతో పాటు లోకేశ్, అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య