Yuvagalam: తెదేపా ‘యువగళం’ క్యాంప్ సైట్పై దాడి.. పోలీసుల అదుపులో 50 మంది వాలంటీర్లు!
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర క్యాంప్ సైట్పై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు.
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర క్యాంప్ సైట్పై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. 3 వాహనాల్లో వచ్చిన పోలీసులు.. యువగళం వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది సహా సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు.
మంగళవారం రాత్రి వైకాపా నేతలు, కార్యకర్తలు పక్కాగా కాపుకాచి లోకేశ్ పాదయాత్రపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలతో పాటు పోలీసులలకు గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలోనే యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని రాత్రి నుంచి పోలీసులు వివిధ ప్రాంతాల్లో తిప్పుతున్నారు. భీమవరం, నర్సాపురం, వీరవాసరం కాళ్ల పోలీస్స్టేషన్లు తిప్పారు. ప్రస్తుతం వారిని సిసిలిలోని రాజ్యలక్ష్మి మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఫ్యాక్టరీలో ఉంచారు.
యువగళం యాత్రపై వైకాపా రాళ్ల వర్షం
అదుపులోకి తీసుకున్న వాలంటీర్లపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. యువగళం పాదయాత్రకి అనుమతి ఇచ్చి అదే రూట్లో వైకాపా కార్యకర్తలు కవ్వింపు చర్యలు.. రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..