TDP: ఆకివీడు పీఎస్కు ‘యువగళం’ వాలంటీర్లు.. భారీగా చేరుకున్న తెదేపా కార్యకర్తలు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి తెల్లవారుజామున తీసుకొచ్చిన తెదేపా ‘యువగళం’ వాలంటీర్లను ఆకివీడు పోలీస్స్టేషన్కు తరలించారు.
ఆకివీడు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి తెల్లవారుజామున తీసుకొచ్చిన తెదేపా ‘యువగళం’ వాలంటీర్లను ఆకివీడు పోలీస్స్టేషన్కు తరలించారు. ఉదయం నుంచి కాలకృత్యాలు కూడా తీర్చుకోనీయకుండా పోలీసులు వారిని తిప్పుతున్నారు. యువగళం వాలంటీర్లతో పాటు వంటచేసేవారిని, వాహన డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఆకివీడు పీఎస్కు తీసుకొచ్చిన నేపథ్యంలో భారీగా తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
దీంతో యువగళం వాలంటీర్లు ఉన్న వాహనాలను మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకున్నారు. పీఎస్ బయట, వాహనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. యువగళం వాలంటీర్లను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ప్రశాంతంగా జరుగుతున్న పాదయాత్రలో అలజడి సృష్టించి రాళ్ల దాడి చేసిన వైకాపా కార్యకర్తలను వదిలి.. యువగళం వాలంటీర్ల వేధిస్తున్నారని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్