జడ్డూ రెడీ: అస్త్రాలను సిద్ధం చేస్తున్న భారత్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జీర్ణించుకోలేని ఓటమిని చవిచూసిన భారత్ బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధమవుతోంది. మెల్బోర్న్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని...
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జీర్ణించుకోలేని ఓటమిని చవిచూసిన భారత్ బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధమవుతోంది. మెల్బోర్న్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. తమ అమ్ములపొదిలోని అస్త్రాలను సానపెడుతోంది. శుభ్మన్ గిల్, జడేజా తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఆటగాళ్లందరూ క్యాచ్ల ప్రాక్టీస్ చేస్తున్నారు. కోచ్ రవిశాస్త్రితో కలిసి కెప్టెన్ రహానె కంగారూలకు చెక్ పెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నాడు. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
వార్మప్ మ్యాచ్లో ఆకట్టుకున్న శుభ్మన్ గిల్ బాక్సింగ్ డే టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది. నెట్స్లో గిల్ బ్యాటింగ్ సాధన చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది. అతడు దీటుగా బంతులను ఎదుర్కొంటున్నాడు. మరోవైపు కంకషన్, తొడకండరాల గాయంతో తొలి టెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా పూర్తిఫిట్నెస్ సాధించాడు. అతడు బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను కూడా బీసీసీఐ పోస్ట్ చేసింది. రెండో టెస్టుకు సన్నద్ధమవతున్నాడని దానికి వ్యాఖ్య జత చేసింది. దీంతో జడ్డూ బరిలోకి దిగడం ఖరారైనట్లే. కాగా, రవిశాస్త్రి పర్యవేక్షణలో ఉమేశ్ యాదవ్, బుమ్రా బౌలింగ్ సాధన చేశారు. గాయంతో షమి జట్టుకు దూరమవ్వడంతో వీరిద్దరు పేస్ బాధ్యతల్ని మోయాల్సి ఉంది.
తొలి టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలి భారత క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఈ ఘోరపరాజయంతో పాటు కెప్టెన్ కోహ్లీ పితృత్వ సెలవులపై మిగిలిన టెస్టులకు దూరమవ్వడం.. టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని భావిస్తున్నారంతా. అయితే గొప్పగా పుంజుకోవాలని భారత ఆటగాళ్లు కసితో ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండో టెస్టులో గెలిచి ఆసీస్ ఆధిక్యాన్ని 1-1తో సమం చేయాలని ఆశిస్తున్నారు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు జరగనుంది.
ఇదీ చదవండి
సన్నీ×అనుష్క..రోహిత్×కోహ్లీ..బంగ్లా ‘అతి’
కరోనా నిబంధనలు: వార్నర్కు షాక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు తరలే ఓటర్లకు తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?