హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు.
జొహానెస్బర్గ్: ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. అతను ధైర్యాన్ని నటిస్తున్నాడని, జట్టులోని అనుభజ్ఞులైన ఆటగాళ్లకు అది రుచించదని పేర్కొన్నాడు. ‘‘హార్దిక్ కెప్టెన్సీ శైలి కాస్త ధైర్యంతో, ఓ రకంగా అహంకారంతో, ఛాతీ విరుచుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అతను మైదానంలో నడిచే తీరు ఎల్లప్పుడూ వాస్తవికంగా ఉన్నట్లు అనిపించడం లేదు. కెప్టెన్గా అలాగే ఉండాలని అతను నిర్ణయించుకున్నాడు. ధోనీలా ప్రశాంతంగా, ఓపికగా అందరినీ కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు ఇలాంటిది పనిచేయదు. గుజరాత్ యువ జట్టుకు సారథిగా హార్దిక్కు అది కలిసొచ్చింది. కానీ ముంబయికి ఆ ధైర్యం అవసరం లేదు. నేను హార్దిక్ను విమర్శించట్లేదు. అతని ఆటను చూడటాన్ని ప్రేమిస్తా. ఛాతీ విరుచుకుని ఉంటే చూడటానికి ఇష్టపడతా. ఎందుకంటే నేనూ అలాగే ఉండేవాణ్ని’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లంక ఢమాల్
ఒకవైపు నోకియా.. మరోవైపు మహారాజ్ వీళ్లిద్దరు చాలదన్నట్టుగా రబాడ.. ఒకరికొకరు పోటీపడి వికెట్లు పడగొట్టడంతో టీ20 ప్రపంచకప్లో శ్రీలంక చిత్తుగా ఓడింది. -
నమీబియా సూపర్ విజయం
టీ20 ప్రపంచకప్లో తొలి రోజు ఆతిథ్య వెస్టిండీస్కు పాపువా న్యూగినీ చెమటలు పట్టించడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తే.. రెండో రోజు చిన్న జట్లు నమీబియా, ఒమన్ మధ్య పోరు సూపర్ ఓవర్కు దారి తీసి తీవ్ర ఉత్కంఠ రేపింది. -
గట్టెక్కిన జకో
ఫ్రెంచ్ ఓపెన్లో త్రుటిలో పెను సంచలనం తప్పింది! టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) అతి కష్టం మీద గట్టెక్కాడు. -
టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీ రూ.93 కోట్లు
ఈసారి టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీ రికార్డు స్థాయిలో పెరిగింది. టోర్నీ నగదు బహుమతిని రూ.93 కోట్లుగా నిర్ణయించినట్లు ఐసీసీ వెల్లడించింది. -
టైటిల్పై సింధు గురి
ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు టైటిల్పై గురిపెట్టింది. -
క్రికెట్కు జాదవ్ వీడ్కోలు
భారత క్రికెట్ మాజీ ఆటగాడు కేదార్ జాదవ్ ఆటకు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల క్రితం చివరిగా టీమ్ఇండియాకు ఆడిన ఈ 39 ఏళ్ల మిడిలార్డర్ బ్యాటర్.. సోమవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. -
బజ్రంగ్పై సస్పెన్షన్ ఎత్తివేత
రెజ్లర్ బజ్రంగ్ పునియాపై విధించిన సస్పెన్షన్ను జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) ఎత్తివేసింది. -
టీ20 ప్రపంచకప్పే చివరిది: ద్రవిడ్
భారత క్రికెట్ కోచ్గా టీ20 ప్రపంచకప్పే తనకు చివరి టోర్నమెంట్ అని రాహుల్ ద్రవిడ్ ఖరారు చేశాడు. -
బైల్స్ తొమ్మిదిసారి..
పారిస్ ఒలింపిక్స్ ముందు అమెరికా జిమ్నాస్టిక్స్ తార సిమోన్ బైల్స్ ఫామ్ చాటుకుంది. -
టీ-20 వరల్డ్ కప్.. క్రీడాభిమానులకు దూరదర్శన్ గుడ్న్యూస్
‘టీ-20 ప్రపంచ కప్ (T20 World Cup)’లో భారత్ ఆడే మ్యాచ్లను ‘డీడీ స్పోర్ట్స్ (DD Sports)’ ఛానెల్లో ప్రసారం చేయనున్నట్లు ప్రభుత్వ సంస్థ ‘ప్రసార భారతి’ ప్రకటించింది. -
టోర్నీ చరిత్రలోనే అత్యధికం.. టీ20 వరల్డ్కప్ విన్నర్కు ప్రైజ్మనీ ఎంతంటే..?
టీ20 ప్రపంచకప్ 2024 ప్రైజ్మనీని ఐసీసీ ప్రకటించింది. -
తోటి ఆటగాడిని హేళన చేసి.. చిక్కుల్లో పాక్ కెప్టెన్ బాబర్ అజాం
టీ20 ప్రపంచకప్ టోర్నీ నేపథ్యంలో పాకిస్థాన్ క్యాంపు ఇబ్బందుల్లో పడింది. కెప్టెన్ బాబర్ అజామ్ తోటి ఆటగాడిని హేళన చేసి వివాదంలో చిక్కుకున్నాడు.