WI vs IND: ‘యూఎస్ఏ’ పేరు వినగానే మీకేమనిపిస్తుంది..? భారత క్రికెటర్లు ఎవరేం చెప్పారంటే?
వెస్టిండీస్తో నాలుగో టీ20 మ్యాచ్ (WI vs IND) ఆడేందుకు భారత్ యూఎస్ఏలోని ఫ్లోరిడాకు చేరింది. ఈ క్రమంలో అగ్రరాజ్యమైన యూఎస్ఏ పేరు వినగానే ఏమని అనిపిస్తుందని భారత క్రికెటర్లకు సరదా ప్రశ్న ఎదురైంది. మరి వారేం చెప్పారో తెలుసుకుందామా..
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం విండీస్తో టీ20 సిరీస్ (WI vs IND) ఆడుతోంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా చివరి రెండు మ్యాచ్లు ఆడేందుకు టీమ్ఇండియా క్రికెటర్లు యూఎస్ఏకు చేరుకున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని లాడర్హిల్స్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా క్రికెటర్లను యూఎస్ఏ పేరు వినిపించగానే ఏమనిపిస్తుందని చెప్పమంటూ సరదాగా చేసిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో పోస్టు చేసింది. కొందరేమో లైఫ్స్టైల్, రిలేటివ్స్, ఫ్యాషన్ అంటూ రకరకాల ఫన్నీ ఆన్సర్లు ఇచ్చారు. మరి ఎవరు ఏం సమాధానం ఇచ్చారో ఓసారి చూసేద్దామా...
ప్రశ్న: యూఎస్ఏ అని పేరు వినిపించగానే మీ మదిలో ఏమని అనిపిస్తుంది?
కెప్టెన్ హార్దిక్ పాండ్య: యూఎస్.. చాలా మంది కల.
అర్ష్దీప్ సింగ్: మియామీ, షాపింగ్. (ఈ రెండింట్లో ఏది ఫస్ట్ అనేదానికి మాత్రం మియామీ అని సమాధానం ఇచ్చాడు).
యశస్వి జైస్వాల్: జీవన శైలి. ఇక్కడి ప్రజల లైఫ్స్టైల్ విభిన్నంగా ఉంటుంది.
చాహల్: నాకు మాత్రం యూఎస్ఏ అనగానే జీటీఏ గుర్తుకొస్తుంది. గ్రాండ్ థెఫ్ట్ ఆటో (GTA) అనే యాక్షన్-అడ్వంచర్ వీడియో గేమ్ సిరీస్. నేను కూడా జీటీఏ ఆడతా.
కుల్దీప్ యాదవ్: నాకు లియోనెల్ మెస్సి గుర్తుకొస్తాడు. ఎక్కడికి వెళ్లినా అతడికి అభిమానులు భారీగా ఉంటారు. అందులో నేను కూడా ఒకడిని. నేనే కాదు మన జట్టులోనూ అతడికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. (మెస్సి ఇటీవలే మియామీలోని మేజర్ లీగ్ సాసర్ క్లబ్కు మారిపోయాడు)
సూర్యకుమార్ యాదవ్: ఐస్క్రీమ్. మరీ ముఖ్యంగా నాకెంతో ఇష్టమైన చీజ్ కేక్. ఇప్పుడు మాత్రం తినలేకపోతున్నా.
ఇషాన్ కిషన్: నాకు యూఎస్ఏ అంటేనే వేడి, ఉక్కపోత గుర్తుకొస్తాయి. వాటి నుంచి దూరంగా వెళ్లాలనిపిస్తుంది.
తిలక్ వర్మ: ఇక్కడ తక్కువగా క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు యూఎస్ఏకు రావడం ఆనందంగా ఉంది. ఇక్కడ పిచ్లపై ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా.
శుభ్మన్ గిల్: నాకు మా చుట్టాలు గుర్తుకొస్తారు. నేను పంజాబీ. మాకు ఇక్కడ చాలా మంది బంధువులు ఉన్నారు. యూఎస్ఏ పేరు వినగానే వారే గుర్తుకు వస్తారు.
అవేశ్ ఖాన్: నేను తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇక్కడే తీసుకున్నా.
ముకేశ్ కుమార్, సంజూ శాంసన్: యూఎస్ఏ అంటే అమెరికా అని గుర్తొస్తుంది. (నవ్వుతూ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా, ముంబయి జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. -
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
41 ఏళ్ల ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్తో తనకు బలమైన బంధం ఉందని గంభీర్ వెల్లడించాడు. ఏ నిర్ణయం తీసుకొన్నా జట్టు శ్రేయస్సు కోసమేనని అతడు నమ్ముతాడన్నాడు. -
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్లో చెన్నై మ్యాచ్లను చూసేందుకు వస్తున్నారు. అతడు కూడా వారిని నిరాశపర్చకుండా దూకుడుగా ఆడేస్తున్నాడు. -
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్
హార్దిక్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వస్తున్న క్రమంలో ముంబయి బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ సారథి అత్యుత్తమమని వ్యాఖ్యానించాడు. -
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
ఐపీఎల్ 17వ సీజన్లో వేటు ఎదుర్కొన్న తొలి ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నేరానికి పాల్పడటంతో సస్పెన్షన్ తప్పలేదు. -
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
మరో కీలక పోరులో ముంబయిని ఢీకొట్టేందుకు కోల్కతా సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి గౌతమ్ గంభీర్కు ప్రత్యేక విజ్ఞప్తి అందింది. -
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
ప్రస్తుత ఎడిషన్లో నాకౌట్ దశకు చేరుకొనే జట్టు ఏంటనేది ఇంకా తెలియలేదు. టాప్-4లోకి వస్తాయని అనుకుంటున్న జట్లకు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్లు షాక్లు ఇస్తున్నాయి. -
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
ఒక్క మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్పై ఫ్రాంచైజీ యజమాని అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ అనుభవం కేఎల్ రాహుల్కు ఎదురైంది. -
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
గెలిచామనే ఆనందం గుజరాత్కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
ఐపీఎల్కు రోహిత్ గుడ్బై చెప్పనున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలైంది. దీనంతటికి కేకేఆర్ పోస్టు చేసిన ఓ వీడియో కారణమైంది. -
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు.