Bengaluru Vs Chennai: బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
ఐపీఎల్ 17వ సీజన్లో క్రికెట్ అభిమానులు శనివారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాకౌట్ దశకు వెళ్లే నాలుగో జట్టు ఏంటా? అనేది తేలేదప్పుడే.
ఇంటర్నెట్ డెస్క్: ప్లేఆఫ్స్ రేసులోని నాలుగు బెర్తుల్లో ఒక్కటి మాత్రమే ఇంకా ఫిల్ కాలేదు. దానికోసం చెన్నై - బెంగళూరు బరిలో నిలిచాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే చెన్నై నేరుగా నాకౌట్కు వెళ్లిపోతుంది. ఒకవేళ మ్యాచ్ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.
- చెన్నై ఏడు మ్యాచుల్లో గెలిచి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. బెంగళూరు ఆరు విజయాలతో 12 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.
- వర్షం పడి మ్యాచ్ రద్దయితే.. చెన్నై ఖాతాలోకి 15 పాయింట్లు వస్తాయి. దాంతో ఎలాంటి ఇబ్బందిలేకుండా ప్లేఆఫ్స్కు దూసుకెళ్తుంది.
- అప్పుడు ఆర్సీబీ 13 పాయింట్లతో ఇంటిముఖం పడుతుంది. దాంతోపాటు ఇప్పటికే పెద్దగా ఆశలు లేని దిల్లీ, లఖ్నవూ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
- మ్యాచ్ జరిగి చెన్నై విజయం సాధిస్తే.. మరే ఇతర గణాంకాలతో సంబంధం లేకుండా నాకౌట్కు చేరుతుంది. ఒకవేళ ఓడినా సీఎస్కేకు అవకాశం ఉంది.
- అయితే... ఆ ఓటమి 18 పరుగుల లోపే ఉండాలి. ఒకవేళ బెంగళూరు గెలిచి ఇరుజట్ల పాయింట్లు సమమైతే.. మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా చెన్నైకే అవకాశం దక్కుతుంది.
బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేస్తే..
- మ్యాచ్ 20 ఓవర్లు, 19 ఓవర్లు జరిగితే చెన్నై ముందు 200 పరుగుల లక్ష్యం పెట్టాలి. ఆ జట్టును 182కే కట్టడి చేయాలి.
- మ్యాచ్ 18 ఓవర్లు జరిగితే 190 పరుగులు చేయాలి.. సీఎస్కేను 172కే పరిమితం చేయాలి.
- 17 ఓవర్లలో 180 రన్స్ చేస్తే.. సీఎస్కేను 162 రన్స్కే నియంత్రించాలి.
- 16 లేదా 15 ఓవర్లు జరిగితే ఆర్సీబీ 170 పరుగులు చేయాలి. చెన్నైను 152కే కట్టడి చేయాలి.
- కనీసం 5 ఓవర్ల గేమ్ జరిగినప్పుడు బెంగళూరు 80 పరుగులు చేస్తే.. చెన్నైను 62కే పరిమితం చేయాలి.
ఆర్సీబీ సెకండ్ బ్యాటింగ్ అయితే..
- 20 ఓవర్ల గేమ్ జరిగి ఆర్సీబీ తొలుత బౌలింగ్ చేసి.. సెకండ్ బ్యాటింగ్ చేస్తే సమీకరణాలు ఇలా ఉన్నాయి.
- చెన్నై నిర్దేశించే 201 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి.
- 19 ఓవర్ల మ్యాచ్ అయితే 17.1 ఓవర్లలోనే 201 రన్స్ను ఛేదించాలి.
- ఒకవేళ మ్యాచ్ 18 ఓవర్లు.. 191 పరుగుల లక్ష్యమైతే.. ఆర్సీబీ 16.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి.
- మ్యాచ్ 17 ఓవర్లు అయితే.. 181 రన్స్ టార్గెట్ను 15.1 ఓవర్లలోనే ఛేదించాలి.
- మ్యాచ్ 16 లేదా 15 ఓవర్లు జరిగి.. లక్ష్యం 171 పరుగులైతే.. ఆర్సీబీ 11 బంతులు మిగిలిఉండగానే విజయం సాధించాలి.
- వర్షం కారణంగా మ్యాచ్ కనీసం 5 ఓవర్లకు కుదిస్తే.. అప్పుడు 81 పరుగుల టార్గెట్ ఎదురైతే 3.1 ఓవర్లలోనే ఛేదించాలి.
👉 చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
👉 కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేరుస్తుందా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?