Team India: ఆ జట్లకు వారిద్దరిలా.. భారత్కు హార్దిక్ టెస్టులు ఆడాలి: మాజీ కెప్టెన్
భారత టీ20 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్య కూడా టెస్టుల్లో ఆడాలనే డిమాండ్లూ ఎప్పట్నుంచో వస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కూడా ఇదే విషయంపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డేలు, టెస్టులు ఆడుతున్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) టెస్టుల్లోనూ ప్రాతినిధ్యం వహించాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ సూచించాడు. అయితే, పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తేనే బరిలోకి దిగాలని పేర్కొన్నాడు. పేస్ ఆల్రౌండర్గా జట్టులో కీలక పాత్ర పోషించాలని తెలిపాడు. ఇంగ్లాండ్కు బెన్ స్టోక్స్, ఆసీస్కు కామెరూన్ గ్రీన్లా హార్దిక్ పాండ్య కూడా జట్టులో ఉంటే విదేశాల్లో భారత్కు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. స్వదేశంలో టీమ్ఇండియా అద్భుతంగా ఆడుతుందని, కానీ విదేశాల్లో మాత్రం నిరుత్సాహానికి గురవుతోందని వ్యాఖ్యానించాడు.
‘‘భారత జట్టులో కూడా స్టోక్స్, కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ వంటి కేటగిరీ ఆటగాడు ఉండాలి. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడం.. కనీసం 10 నుంచి 15 ఓవర్లు సీమ్ బౌలింగ్ వేసేలా ఉంటే టీమ్కు ఎంతో ప్రయోజనం. స్వదేశీ పిచ్లపై రోహిత్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఓవర్సీస్ పిచ్లపై హార్దిక్ పాండ్య వంటి ఆల్రౌండర్ టెస్టుల్లో అవసరం ఉంది’’ అని నాజర్ హుసేన్ తెలిపాడు.
మరోసారి విండీస్ బోర్డు తీరుపై అశ్విన్
విండీస్ క్రికెట్ మైదానాల్లో సరైన సదుపాయాలు లేవని విమర్శలు గుప్పించిన రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ట్విటర్ వేదికగా స్పందించాడు. భారత్ - విండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంపై విమర్శించాడు. 30 అడుగుల సర్కిల్ను మార్క్ చేయడంలో గయానా మైదానం సిబ్బంది జాప్యం చేశారు. దీంతో మ్యాచ్ దాదాపు ఐదు నిమిషాలపాటు ఆలస్యంగా ప్రారంభమైంది. దీనిని ఉద్దేశిస్తూ అశ్విన్ ట్వీట్ చేశాడు. ‘‘ఇది ప్రత్యేకమైన జాప్యం. ఇలాంటి కారణాలతో పర్యటించడం అంత సులువేం కాదు. క్రికెటర్గా ఇలాంటి ఊహించని పరిస్థితులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.
సంజూ.. వృథా చేసుకోవద్దు: చోప్రా
టీ20ల్లో యువకులు అదరగొడుతుండగా.. సీనియర్ సంజూ శాంసన్ మాత్రం రెండు టీ20ల్లో విఫలమై నిరాశపరిచాడు. మూడో మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో వచ్చే రెండు మ్యాచుల్లోనైనా అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సంజూ శాంసన్కు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. ‘‘సంజూ నీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో. ఇప్పుడు వృథా చేసుకుంటే తర్వాత అందిపుచ్చుకోలేవు. తర్వాత గుర్తు చేసుకుని బాధ పడాల్సి ఉంటుంది. ఇషాన్ కిషన్ సరిగా ఆడకపోయినప్పుడు సంజూ ఆ బాధ్యత తీసుకోవాలి. లేకపోతే వీరిద్దరి మధ్యలోకి జితేశ్ శర్మ వచ్చేస్తాడు. విండీస్ పర్యటనలో జితేశ్ ఏంటో నిరూపించుకున్నాడు’’ అని చోప్రా పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?