WTC Final : జరిమానాలు పని చేయవు.. ఓవర్కు 20 పరుగులు ఇవ్వాలి : ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
క్రికెట్లో స్లో ఓవర్ రేట్(Slow Over Rate) కారణంగా ఆయా జట్లపై విధిస్తున్న జరిమానాలపై ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : WTC Finalలో స్లో ఓవర్ రేట్(Slow Over Rate) కారణంగా ఇరు జట్లకు ఐసీసీ(ICC) భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. మొత్తం మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా 44 ఓవర్లు కోల్పోవడంతో.. పలువురు దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో జరిమానాలు పనిచేయవని ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం మైఖెల్ వాన్(Michael Vaughan) అన్నాడు. కేవలం జరిమానాలతోనే.. ఇలాంటివి భవిష్యత్లో జరగకుండా ఆపలేమని అభిప్రాయపడ్డాడు. దీనికి ఓ పరిష్కారాన్ని కూడా సూచించాడు.
‘స్లో ఓవర్రేట్ కారణంగా WTC Finalలో దాదాపు సగం రోజు ఆటను కోల్పోయాం.. దీనిని ఎలా నియంత్రించాలి?’ అంటూ ఓ క్రీడా ఛానల్ పెట్టిన ట్వీట్కు మైఖెల్ వాన్ బదులిచ్చాడు. ‘ఇలాంటి విషయాల్లో జరిమానాలు పనిచేయవు. చివరి రోజున బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు పరుగులను అదనంగా ఇవ్వాలి. ఒక్కో ఓవర్కు 20 పరుగుల చొప్పున ఇవ్వాలి. అదే దీనికి పరిష్కారం’ అంటూ సూచించాడు.
స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ (ICC) భారీ జరిమానా విధించింది. రోహిత్ సేన మొత్తానికి మ్యాచ్ ఫీజులో 100శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. అటు టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా (Australia)కూ జరిమానా తప్పలేదు. స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) కారణంగా ఆసీస్ జట్టుకు వారి మ్యాచ్ ఫీజులో 80శాతం కోత విధించింది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. -
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే విరాట్ కోహ్లీ(Virat Kohli).. ప్రత్యర్థి వికెట్ పడితే తనదైన శైలిలో సంబరాలు చేసుకుంటాడు. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. -
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
Bengaluru vs Delhi: కీలక మ్యాచ్లో బెంగళూరు చేతిలో దిల్లీ ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను దూరం చేసుకుంది. -
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
ధోనీ-రైనా జోడీ మైదానంలో చెన్నై అభిమానులకు కనువిందు చేసింది. -
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
-
‘ఇక నేను పెళ్లి చేసుకోవాలి’: రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..