Gautam Gambhir: ‘మీరు భావితరాల ఆడ పిల్లలకు ఘన వారసత్వాన్ని ఇచ్చారు’

Eenadu icon
By Sports News Team Updated : 03 Nov 2025 10:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: రెండు పర్యాయాలు ఫైనల్‌కు చేరినా విజేతగా మాత్రం నిలవలేకపోయారు. ఈసారి ఆ పరాభవాలకు చెక్‌ పెడుతూ 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత మహిళల జట్టు తెర దించింది. వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించింది. ఈ క్రమంలో భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్‌ఇండియా పురుష జట్టు ప్రధాన కోచ్‌ గౌతమ్ గంభీర్‌ ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు. మహిళా జట్టు ప్రదర్శనపై సచిన్, విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తంచేశారు. అలాగే మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, అశ్విన్, శిఖర్ ధావన్‌ తదితరులు అభినందనలు తెలిపారు. 

‘‘మీరు కేవలం చరిత్రను మాత్రమే సృష్టించలేదు. భావితరాల ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు. ఘనమైన వారసత్వాన్ని ఇచ్చారు’’ - గంభీర్‌

‘‘అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. భారతీయుడిగా వారు సాధించిన దానికి గర్వపడకుండా ఉండలేను. ప్రశంసలన్నింటికీ హర్మన్‌ ప్రీత్ సేన అర్హులు. కంగ్రాట్స్‌ టీమ్‌ఇండియా. మేనేజ్‌మెంట్‌, ప్లేయర్లు కలిసి అద్భుతం చేశారు. ఈ క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. రాబోయే తరాలకు మీరు స్ఫూర్తిగా నిలిచారు. జై హింద్‌’’ - విరాట్ కోహ్లీ

‘‘పెద్ద కలలు కనండి. వాటిని నెరవేర్చుకోండి. ఈ మాటలు భారత మహిళా జట్టుకు సరిగ్గా సరిపోతాయి. ‘1983’ భారతీయులకు స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడీ విజయం యువ క్రీడాకారిణులకు స్ఫూర్తి. భారత మహిళా క్రికెట్‌ ప్రయాణం మరింత ఉన్నతంగా మారేందుకు మార్గం’’ - సచిన్‌

‘‘కంగ్రాట్స్‌. వన్డే ప్రపంచకప్‌లో మీ క్యాంపెయిన్‌ అద్భుతంగా సాగింది. సూపర్‌గా ఆడారు. జట్టులోని ప్రతిఒక్కరూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సహాయక సిబ్బంది సహకారం మరువలేనిది’’ - అశ్విన్

‘‘మహిళా జట్టుకు అభినందనలు. వరల్డ్‌ కప్‌ నెగ్గి అద్భుతం చేశారు. దీప్తి శర్మ, షెఫాలీ వర్మ చాలా బాగా ఆడారు’’ - ఇర్ఫాన్ పఠాన్

‘‘వుమెన్ ఇన్‌ బ్లూ అద్భుతమైన విజయం. షెఫాలీ వర్మ ఫియర్‌లెస్ బ్యాటింగ్‌. దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన. ఛాంపియన్‌గా నిలిచేందుకు పూర్తి అర్హత ఉంది’’ - శిఖర్ ధావన్‌

Tags :
Published : 03 Nov 2025 10:33 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు