IND vs AUS: కొంపముంచిన వాన
విశాఖ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్కు అనుకూలం. అయితే రెండ్రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పు పిచ్ పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసింది.
విశాఖ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్కు అనుకూలం. అయితే రెండ్రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పు పిచ్ పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసింది. శుక్ర, శనివారాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు కూడా పడ్డాయి. ఇక శనివారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 10 గంటల వరకు చినుకులు పడుతూనే ఉన్నాయి. దీంతో వికెట్పై తేమ అలాగే ఉండిపోయింది. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న ఆసీస్.. అయిదుగురు పేసర్లతో బరిలో దిగింది. వారిలో స్టాయినిస్కు బౌలింగ్ చేసే అవసరమే రాలేదు. గత మ్యాచ్లో ఆడిన మ్యాక్స్వెల్ను తప్పించి అతని స్థానంలో పేసర్ నాథన్ ఎలిస్ను ఆడించింది. భారత్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. విశాఖలో ఎప్పట్లాగే స్పిన్నర్లు ప్రభావం చూపుతారని భావించి శార్దూల్ ఠాకూర్ బదులు అక్షర్ పటేల్తో బరిలో దిగింది. కానీ పరిస్థితులు పూర్తిగా ఆసీస్కు అనుకూలించాయి. ఆ జట్టు పేసర్లు విజృంభించి భారత్ను కుప్పకూల్చి మన జట్టుకు ఘోర పరాభవాన్ని మిగిల్చారు.
స్వింగ్తో తంటాలేల?
వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్లపై 3-0తో సిరీస్ విజయాలు.. కోహ్లి వరుస శతకాలు.. గిల్ భారీ ఇన్నింగ్స్లు భారత అభిమానుల్ని ఉర్రేతలూగించాయి. సొంతగడ్డపై మరికొన్ని నెలల్లో జరిగే ప్రపంచకప్లో మనకు ఎదురేలేదన్న ధీమాను కలిగించాయి. అయితే ఆసీస్తో మొదటి రెండు వన్డేల అనంతరం ఏదో తేడాగా ఉందన్న అనుమానాలు ప్రారంభమమయ్యాయి. శ్రీలంక, కివీస్లతో ఆడిన ఆరు వన్డేల్లో నాల్గింట్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. శ్రీలంకతో గువాహటిలో 373/7, తిరువనంతపురంలో 390/5.. కివీస్తో హైదరాబాద్లో 349/8, ఇందౌర్లో 385/9 స్కోర్లతో భారత్ చెలరేగింది. ఫ్లాట్ పిచ్లపై భారత బ్యాటర్లకు తిరుగులేకపోయింది. కానీ బంతి కాస్త ప్రభావం చూపే పిచ్లకొచ్చేసరికి బ్యాట్లెత్తేశారు. శుక్రవారం వాంఖడే, ఆదివారం విశాఖలో భారత ఇన్నింగ్స్లే ఇందుకు నిదర్శనం. తొలి వన్డేలో భారత్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 83 పరుగులకే సగం మంది పెవిలియన్ చేరారు. ఇక రెండో వన్డేలో పరిస్థితి మరీ ఘోరం. 49 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. 117 పరుగులకే ఆలౌట్. సగం ఓవర్లకే ఇన్నింగ్స్ను ముగించారు.
గిల్ నుంచి పాండ్య వరకు భారత బ్యాటర్లు ఔటైన తీరు ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. రెండు మ్యాచ్ల్లోనూ భారత బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఎడమచేతి వాటం పేసర్ స్టార్కే. పిచ్ నుంచి ఏమాత్రం సహకారం లభించినా అతడిని ఎదుర్కోవడం కష్టమన్నది తేలిపోయింది. గతంలో ఎడమచేతి వాటం పేసర్లను ఆడటంలో భారత బ్యాట్స్మెన్ ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మళ్లీ అలాంటి సమస్యే రావడం కోచ్ రాహుల్ ద్రవిడ్ మెదడుకు పని చెప్పేదే. ఇక విశాఖ వన్డేలో భారత బ్యాటర్లు ప్రాథమిక సూత్రాల్ని కూడా పక్కనబెట్టినట్లు కనిపిస్తుంది. పేసర్లకు సహకరిస్తున్న పిచ్పై మొదట క్రీజులో కుదురుకోవడం ముఖ్యమన్న విషయాన్ని మరిచిపోయారు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతుల్ని ఆడటం ద్వారా గిల్, రోహిత్, పాండ్య ఔటయ్యారు. ఏమాత్రం ఫుట్వర్క్ లేకుండా నిల్చున్న స్థానం నుంచే బంతుల్ని వెంటాడితే ఏం జరుగుతుందో ఉదాహరణలుగా నిలిచారు. సూర్యకుమార్ షాట్ సెలెక్షన్ మరీ పేలవం. టీ20ల్లో మాదిరే వన్డేల్లోనూ తొలి బంతికే పరుగులు రాబట్టాలని.. బౌండరీ, సిక్సర్ బాదాలని అతడికి ఎవరు చెప్పారో? టీ20 ఆలోచన తీరుతో బ్యాటింగ్ చేయబోయి అతను దెబ్బ తింటున్నాడు. ఒకట్రెండు బంతుల్ని డిఫెన్స్ ఆడి క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయకపోతే అతడికి కష్టమే. టీమ్ఇండియా తరచుగా చేస్తున్న మరో పొరపాటు.. కుడి, ఎడమల కూర్పు లేకపోవడం. బ్యాటింగ్ ఆర్డర్లో వరుసగా రోహిత్, గిల్, కోహ్లి, సూర్య, రాహుల్, హార్దిక్ల రూపంలో ఆరుగురు కుడిచేతి వాటం బ్యాటర్లే. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు.. వికెట్లు వెంటవెంటనే పడుతున్నప్పుడు కూర్పును మార్చాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదన్నది ప్రశ్న. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వరుసగా 7, 8 స్థానాల్లో బ్యాటింగ్కు వస్తున్నారు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో ఈ ఇద్దరి బ్యాటింగ్ బాగుంది. జడేజా, అక్షర్లలో ఒకరిని 4, మరొకరిని ఆరో స్థానంలో ఉపయోగించుకోడానికి జట్టుకున్న ఇబ్బందేమిటో అర్థంకాదు. ప్రపంచకప్కు ఆయా బ్యాటింగ్ స్థానాల్ని ఖాయం చేసుకుంటున్న భారత్.. ఆర్డర్పై సరైన కసరత్తు చేస్తుండకపోవడం పొరపాటే. కనీసం క్లిష్టమైన మ్యాచ్ల్లో అయినా ఎడమచేతి వాటం బ్యాటర్లను ముందుకు పంపితే రెండో వన్డేలాంటి అనుభవాల్ని తప్పించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!