WI vs IND: వదలని వరుణుడు.. విండీస్తో రెండో టెస్టు డ్రా
వెస్టిండీస్,భారత్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్య కాలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగినట్లు అంపైర్లు ప్రకటించారు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్, భారత్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో ఐదో రోజు ఒక్క ఓవర్ కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. రెండు టెస్టుల సిరీస్ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఐదో రోజు తొలి సెషన్ ప్రారంభం కావడానికి ముందు నుంచే మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వాన ఎంతకీ తగ్గకపోవడంతో లంచ్ బ్రేక్ ప్రకటించారు. తర్వాత వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ను 10: 45 గంటల నుంచి మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే చిరుజల్లులు కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే భారీ వర్షం కురిసింది. దీంతో అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చి డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు.
రెండో టెస్ట్ మ్యాచ్లో మొదటి నుంచి భారత్ ఆధిపత్యం చూపించింది. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 438 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 255 పరుగులకే ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్లో 183 పరుగుల ఆధిక్యాన్ని సంంపాదించింది. రెండో ఇన్నింగ్స్ను భారత్ 181/2 వద్ద డిక్లేర్ చేసి ఆతిథ్య జట్టుకు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే విండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 76/2 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో (5/60)తో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. జులై 27 నుంచి వెస్టిండీస్, భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ - 438 ఆలౌట్
విండీస్ తొలి ఇన్నింగ్స్ - 255 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ - 181/2 డిక్లేర్డ్
విండీస్ రెండో ఇన్నింగ్స్ - 76/2
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఓటర్లకు పంచేందుకు తరలింపు.. ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత