చివరికి బజ్బాలే
రెండేళ్లుగా బజ్బాల్ ఆటతో ఇంగ్లాండ్ టెస్టుల్లో ఎలా దూసుకుపోతోందో తెలిసిందే. భారత పర్యటనలోనూ అదే పంథా అనుసరిస్తామని ఇంగ్లిష్ ఆటగాళ్లు ముందే చెప్పారు.
రెండేళ్లుగా బజ్బాల్ ఆటతో ఇంగ్లాండ్ టెస్టుల్లో ఎలా దూసుకుపోతోందో తెలిసిందే. భారత పర్యటనలోనూ అదే పంథా అనుసరిస్తామని ఇంగ్లిష్ ఆటగాళ్లు ముందే చెప్పారు. కానీ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ప్రణాళిక ప్రకారం సాగిన టీమ్ఇండియా ఆధిపత్యం ప్రదర్శించి బజ్బాల్కు చెక్ పెట్టినట్లే కనిపించింది. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఓ దశలో మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిస్తుందేమో అనిపించింది. కానీ పరిస్థితి తలకిందులైంది. అనూహ్యంగా భారత్ తడబడటంతో తనకు అలవాటైన రీతిలో పుంజుకున్న ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. చివరకు బజ్బాలే నెగ్గింది. అందుకు ప్రధాన కారణం ఒలీ పోప్, టామ్ హార్ట్లీ. రెండో ఇన్నింగ్స్లో పోప్ 196 పరుగుల అద్భుత ఇన్నింగ్స్తో జట్టు ఆశలు నిలపగా.. హార్ట్లీ 7 వికెట్లతో గెలిపించాడు. మొత్తంగా తన అరంగేట్ర టెస్టులో అతను 9 వికెట్లు సాధించాడు. స్పిన్తో ఇంగ్లాండ్ను దెబ్బకొట్టాలని చూసిన భారత్కు అదే బూమరాంగ్లా తగిలింది. పోప్ దెబ్బకు లైన్, లెంగ్త్ తప్పిన మన స్పిన్నర్లు పరుగులు ఇచ్చేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 45/1తో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పోప్ 386 నిమిషాల పాటు క్రీజులో నిలిచి చివరి వికెట్గా వెనుదిరిగాడు. స్పిన్కు అనుకూలమైన పిచ్పై అశ్విన్, జడేజా, అక్షర్ లాంటి స్పిన్నర్లను అతను ఎదుర్కొన్న తీరు అద్భుతం. స్వీప్ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించి విజయవంతమయ్యాడు. ఆదివారం తొలి సెషన్లోనూ ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయకపోవడం కొంపముంచింది. ఇక హార్ట్లీ స్పిన్కు మన బ్యాటర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. రోహిత్ కనీసం స్వీప్ షాట్లు ఆడాడు. మిగతా బ్యాటర్లకు క్రీజులో నిలవడమే కష్టమైపోయింది. అశ్విన్, భరత్ లాగా మిగతా బ్యాటర్లూ కనీస పోరాట పటిమ ప్రదర్శించి ఉంటే ఫలితం మరోలా ఉండేదే. ఈ ఓటమితో ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ అంత తేలిక కాదని మన జట్టుకు స్పష్టంగా తెలిసొచ్చింది. మరి మిగతా నాలుగు మ్యాచ్ల్లో మన జట్టు వ్యూహం మారుస్తుందా? 2021లోనూ ఇలాగే ఓటమితో ఇంగ్లాండ్ సిరీస్ను మొదలెట్టిన భారత్.. మిగతా మూడు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ దక్కించుకుంది. మరి ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందా..? లేక భారత్ పుంజుకుని ఆ జట్టుకు చెక్ పెడుతుందా..?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సెమీస్లో గౌరవ్
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
-
ప్రలోభ పెట్టినా ‘చెవి’లో పువ్వే!.. సహకరించని సొంత పార్టీ నేతలు
-
అమ్మకు మందులు తెచ్చేందుకు వెళ్లి అనంతలోకాలకు..
-
కదిలొచ్చిన ఓటు.. కలిసొచ్చేది ఎటు!
-
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
-
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు