జాదుమణి, ఆకాశ్‌ ముందంజ

ఏఎస్‌బీసీ ఆసియా అండర్‌-22 యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జాదుమణి సింగ్‌ (51 కేజీ), ఆకాశ్‌ గోర్కా (60 కేజీ) క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు.

Published : 29 Apr 2024 01:43 IST

ఆస్తానా (కజకిస్థాన్‌): ఏఎస్‌బీసీ ఆసియా అండర్‌-22 యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జాదుమణి సింగ్‌ (51 కేజీ), ఆకాశ్‌ గోర్కా (60 కేజీ) క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో బాటుల్గా (మంగోలియా)పై జాదుమణి ఘన విజయం సాధించాడు. జాదుమణి పంచ్‌లకు ప్రత్యర్థి తాళలేకపోవడంతో రిఫరీ బౌట్‌ నిలిపేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించాడు. మరో బౌట్లో ఆకాశ్‌ 4-1తో గాన్‌ ఎర్డెన్‌ (మంగోలియా)ను ఓడించాడు. జతిన్‌ (57 కేజీ), సాగర్‌ (60 కేజీ), యశ్‌వర్దన్‌ సింగ్‌ (63.5 కేజీ) ఇప్పటికే తొలి రౌండ్‌ దాటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని