బంగ్లాతో తొలి టీ20లో భారత్‌ ఘనవిజయం

బంగ్లాదేశ్‌తో అయిదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్‌ప్రీత్‌ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

Published : 29 Apr 2024 01:46 IST

సిలెట్‌ (బంగ్లాదేశ్‌): బంగ్లాదేశ్‌తో అయిదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్‌ప్రీత్‌ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట భారత్‌ 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. యాస్తిక భాటియా (36), షెఫాలి వర్మ (31), హర్మన్‌ప్రీత్‌ (30) పర్వాలేదనిపించారు. రబేయా ఖాన్‌ (3/23), మారుఫా అక్తర్‌ (2/13) భారత్‌ను దెబ్బ తీశారు. అనంతరం ‘ప్లేయర్‌’ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రేణుక సింగ్‌ (3/18)తో పాటు పూజ వస్త్రాకర్‌ (2/25) విజృంభించడంతో బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 101 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ నిగర్‌ సుల్తానా (51) మినహా బ్యాటర్లు విఫలమయ్యారు. రెండో టీ20 మంగళవారం జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని