నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్..
ఐపీఎల్లో మరో ‘కొత్త’ మెరుపు
41 బంతుల్లోనే సెంచరీ
గుజరాత్పై ఆర్సీబీ గెలుపు
అహ్మదాబాద్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. ఆదివారం విధ్వంసక శతకంతో జట్టుకు ఘనవిజయాన్నందించాడు. ఒక దశ వరకు మామూలుగానే ఆడిన జాక్స్.. మధ్యలో పూనకం వచ్చినట్లు గుజరాత్ బౌలర్లపై పడిపోయాడు. కేవలం 10 బంతుల్లో తన రెండో 50ని అందుకుని మొత్తంగా 41 బంతుల్లోనే శతకం సాధించి ఔరా అనిపించాడు. కోహ్లి కూడా చెలరేగడంతో 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఛేదించేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ 200పై లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.
ఈ ఐపీఎల్ సీజన్లో రెండో విజయం సాధించడానికి నెల రోజులు వేచి చూసింది బెంగళూరు. ఆ గెలుపు ఊపులో ఇంకో రోజుల్లోనే మరో విజయాన్ని అందుకుంది. ఆదివారం బెంగళూరు.. గుజరాత్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట సాయి సుదర్శన్ (84 నాటౌట్; 49 బంతుల్లో 8×4, 4×6), షారుక్ ఖాన్ (58; 30 బంతుల్లో 3×4, 5×6) మెరుపులతో గుజరాత్ 200/3 స్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (100 నాటౌట్; 41 బంతుల్లో 5×4, 10×6) విధ్వంసక శతకంతో లక్ష్యాన్ని ఆర్సీబీ 16 ఓవర్లలో ఒక్క వికెటే కోల్పోయి అందుకుంది. కోహ్లి (70 నాటౌట్; 44 బంతుల్లో 6×4, 3×6) కూడా సత్తా చాటాడు.
మొదట కోహ్లి..: 201 ఛేదనలో బెంగళూరుకు కెప్టెన్ డుప్లెసిస్ (24; 12 బంతుల్లో 1×4, 3×6) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఒకవైపు కోహ్లి నెమ్మదిగా ఆడుతుంటే డుప్లెసిస్ మాత్రం బాదడంపైనే దృష్టి పెట్టాడు. దీంతో ఆర్సీబీ 3 ఓవర్లకు 37/0తో దూసుకెళ్లింది. పవర్ప్లేలోనే డుప్లెసిస్ వెనుదిరిగినా.. బాదే బాధ్యతను విరాట్ తీసుకున్నాడు. సాయికిశోర్ వేసిన అయిదో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలోనే విరాట్ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 123/1. సాధించాల్సిన రన్రేట్ దాదాపు పది వరకు ఉంది. కోహ్లి ఇలాగే ఆడుతూపోతే గెలుపు తథ్యం అన్న అంచనాల్లో ఉన్నారు అభిమానులు! విరాట్ను ఔట్ చేస్తే ఆర్సీబీని చుట్టేయచ్చన్న ఆలోచనలో ఉంది గుజరాత్! కానీ ముప్పు ఇంకోవైపు ఉందని ఊహించలేకపోయింది.
అమ్మో జాక్స్..: కోహ్లి ఒకవైపు బాదుతుంటే మరోవైపు ఓపిగ్గా బంతికో పరుగు చొప్పున చేస్తూ మద్దతు ఇచ్చాడు జాక్స్. మొదట 16 బంతుల్లో 16 పరుగులే చేసిన అతడు.. 22 బంతుల్లో 29 పరుగులతో కాస్త వేగాన్ని పెంచాడు. కానీ అక్కడ నుంచి పూనకం వచ్చినట్టు బౌలర్లపై పడిపోయాడు. బౌలర్లపై కసి ఉన్నట్టుగా అతడు కొట్టడం.. బంతి వెళ్లి ప్రేక్షకుల్లో పడడం.. ఇలా సాగింది జాక్స్ ఆట. ముఖ్యంగా మోహిత్ వేసిన 15 ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఆ ఓవర్లో 3 సిక్స్లు, 2 ఫోర్లతో ఏకంగా 29 పరుగులు రాబట్టిన జాక్స్.. 16వ ఓవర్లో (రషీద్ఖాన్) మరో నాలుగు సిక్స్లు, ఫోర్ బాది 41 బంతుల్లో సెంచరీ సాధించడమే కాక.. ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించాడు. 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జాక్స్.. కేవలం మరో పది బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. 14 ఓవర్లకు సమీకరణం 36 బంతుల్లో 54గా ఉంటే మరో రెండు ఓవర్లలోనే బెంగళూరు ఛేదన పూర్తయిందంటే జాక్స్ విధ్వంసాన్ని ఊహించొచ్చు.
సుదర్శన్, షారుక్ మెరుపులు: అంతకుముందు స్పిన్నర్ స్వప్నిల్ సింగ్తో తొలి ఓవర్ వేయించిన బెంగళూరు ఆరో బంతికే ఫలితం రాబట్టింది. సన్రైజర్స్తో గత మ్యాచ్లో ట్రావిస్ హెడ్ను త్వరగా పెవిలియన్ చేర్చిన మ్యాచ్ను మలుపుతిప్పిన స్వప్నిల్.. ఈసారి సాహా (5)ను ఔట్ చేశాడు. అక్కడ నుంచి ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పవర్ప్లేలో జీటీ ధాటిగా ఆడలేకపోయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (16) కూడా స్పిన్నర్ మ్యాక్స్వెల్కి దొరికిపోవడంతో 7 ఓవర్లకు 47/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో ఓపెనర్ సాయి సుదర్శన్, షారుక్ ఖాన్తో కలిసి ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎనిమిదో ఓవర్లో సుదర్శన్ ఓ సిక్స్, ఫోర్..తొమ్మిదో ఓవర్లో షారుక్ ఓ సిక్స్, ఫోర్ బాదడంతో గుజరాత్ స్కోరులో కదలిక వచ్చింది. షారుక్ సిక్సర్లతో సాగగా.. సుదర్శన్ గ్రౌండ్ షాట్లతో స్కోరు పెంచడంతో జీటీ 14 ఓవర్లకు 131/2తో భారీ స్కోరుపై కన్నేసింది. కానీ సిరాజ్ వేసిన ఓ రివర్స్ స్వింగ్ యార్కర్కి షారుక్ క్లీన్బౌల్డ్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ స్థితిలో సుదర్శన్, మిల్లర్ (26 నాటౌట్; 19 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా ఆడడంతో జీటీ 200 మార్కును అందుకుంది.
గుజరాత్ ఇన్నింగ్స్: సాహా (సి) కర్ణ్శర్మ (బి) స్వప్నిల్ సింగ్ 5; శుభ్మన్ గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్వెల్ 16; సుదర్శన్ నాటౌట్ 84; షారుక్ ఖాన్ (బి) సిరాజ్ 58; మిల్లర్ నాటౌట్ 26; ఎక్స్ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200; వికెట్ల పతనం: 1-6, 2-45, 3-131; బౌలింగ్: స్వప్నిల్ సింగ్ 3-0-23-1; సిరాజ్ 4-0-34-1; యశ్ దయాల్ 4-0-34-0; మ్యాక్స్వెల్ 3-0-28-1; కర్ణ్శర్మ 3-0-38-0; గ్రీన్ 3-0-42-0
బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 70; డుప్లెసిస్ (సి) శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ నాటౌట్ 100; ఎక్స్ట్రాలు 12 మొత్తం: (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206; వికెట్ల పతనం: 1-40; బౌలింగ్: అజ్మతుల్లా 2-0-18-0; సందీప్ వారియర్ 1-0-15-0; సాయికిశోర్ 3-0-30-1; రషీద్ 4-0-51-0; నూర్ 4-0-43-0; మోహిత్శర్మ 2-0-41-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరివో మూడు బెర్తులు?
ఐపీఎల్-17లో కోల్కతా నైట్రైడర్స్కు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
వర్షం వచ్చింది.. కథ ముగిసింది
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిణుకుమిణుకుమంటున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. -
థాయ్లాండ్ టైటిల్పై సాత్విక్ జోడీ గురి
పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. థాయ్లాండ్ ఓపెన్ ప్రపంచ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్పై గురిపెట్టారు. -
నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద, హంపి
భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, కోనేరు హంపి, వైశాలి నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీపడనున్నారు. -
నిఖత్, మీనాక్షి, అనామిక శుభారంభం
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (52 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) అనామిక (50 కేజీలు) శుభారంభం చేశారు. -
అదేం పెద్ద గొడవ కాదు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా మధ్య జరిగింది పెద్ద గొడవేం కాదని ఎల్ఎస్జీ సహాయ కోచ్ లాన్స్ క్లూసెనర్ అన్నాడు. -
వాళ్లు వెళ్లిపోతున్నారు
టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్తో జరిగే టీ20 సిరీస్ కోసం రావాల్సిందిగా ఈసీబీ ఆదేశించడంతో ఐపీఎల్-17లో ఆడుతున్న కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వదేశానికి బయల్దేరుతున్నారు. -
మహిళల షాట్పుట్లో అభా జాతీయ రికార్డు
జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మహిళల షాట్పుట్లో అభా ఖతువా జాతీయ రికార్డు నెలకొల్పింది. -
కుర్రాళ్లూ.. టెస్టు క్రికెట్ ఆడండి
యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడడంపై దృష్టి సారించాలని.. సుదీర్ఘ ఫార్మాట్లో రాణిస్తేనే అసలైన గౌరవం దక్కుతుందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. -
సంక్షిప్త వార్తలు
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ సత్తా చాటాడు. -
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
కెప్టెన్ కేఎల్ రాహుల్పై ఆ జట్టు యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై లఖ్నవూ టీమ్ స్పందించింది. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం