Ruturaj Gaikwad: వారిని చూస్తుంటే.. మా జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్టుంది: రుతురాజ్ గైక్వాడ్
వరుసగా రెండో విజయంతో చెన్నై జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో చెన్నై రెండో విజయాన్ని నమోదు చేసింది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ను 63 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అన్ని విభాగాల్లోనూ రాణించిన చెన్నై.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలుత బ్యాటింగ్.. ఆపైన అదిరిపోయే బౌలింగ్, ఫీల్డింగ్తో అభిమానులను అలరించింది. సీనియర్లు ఎంఎస్ ధోనీ, అజింక్య రహానె ఫీల్డింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘మూడు విభాగాల్లోనూ మేం అదరగొట్టాం. గుజరాత్ వంటి ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించాం. చెన్నై పిచ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. తొలుత బ్యాటింగా?బౌలింగా? అనే దానితో సంబంధం లేకుండా ఆడాలని భావించాం. అదే ప్రణాళికతో బరిలోకి దిగాం. వికెట్లు చేతిలో ఉంటే చివర్లో మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దూబె, రచిన్ కీలకమైన ఇన్నింగ్స్లు ఆడారు. దూబెతో మేనేజ్మెంట్, ధోనీ ప్రత్యేకంగా వర్కౌట్ చేశారు. అతడి ఆత్మవిశ్వాసం స్థాయి అద్భుతం. ధోనీ, అజింక్య రహానె వంటి సీనియర్లు ఫీల్డింగ్లోనూ మెరుపులు మెరిపించారు. దీంతో మా జట్టులో అదనంగా మరో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లుంది. రహానె ఫీల్డింగ్ నైపుణ్యం గత మ్యాచ్లోనూ చూశాం. నాణ్యమైన ఫీల్డింగ్ మాకు అదనపు బలం’’ అని రుతురాజ్ తెలిపాడు.
పవర్ ప్లేలో వెనుకబడిపోయాం: గిల్
‘‘మా బ్యాటింగ్ను చెన్నై కట్టడి చేసింది. వారి ప్రణాళికలు చక్కగా అమలు చేయగలిగారు. పవర్ ప్లేలో ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేది. కానీ అలా జరగలేదు. ఈ వికెట్ మీద 200 వరకు ఛేదించవచ్చని భావించాం. ఈ మ్యాచ్ ద్వారా మా బౌలర్లకు మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు అవకాశం దొరికింది. టోర్నీ మధ్యలో కాకుండా ఇప్పుడే ఇలాంటి మ్యాచ్ ఆడేయడం మంచిదైంది. కెప్టెన్గా నేను చాలా అంశాలను నేర్చుకునే దశలో ఉన్నా. కొత్త అనుభవాలు, విభిన్న సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది తెలుసుకుంటున్నా. గత రెండేళ్లు మేం ఫైనల్కు చేరాం. ఈసారి కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తాం’’ అని గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం