ICC : ఐసీసీ కొత్త నిబంధనలివే.. ఆటలో ఎలాంటి మార్పులు రానున్నాయంటే..?
icc new rules: ఆటలో పలు నియమాలను మార్చుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో కొన్ని నియమాలను మార్చుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం ప్రకటించింది. సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫార్సులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో మార్పులను ఐసీసీ వెల్లడించింది. ఎంసీసీ 2017 క్రికెట్ కోడ్ చట్టాల మూడో ఎడిషన్ అప్డేషన్ల గురించి గంగూలీ నేతృత్వంలోని కమిటీ చర్చించి కొత్త ప్రతిపాదనలు చేసింది. వీటిని ఆ తర్వాత మహిళల క్రికెట్ కమిటీతోనూ పంచుకుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనలివే..
🏏 బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే.. స్ట్రయికర్ ఉన్న స్థానంలోకే కొత్త బ్యాటర్ వస్తారు. క్యాచ్ పట్టే సమయంలో బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్ చేసినా పరిగణనలోకి తీసుకోరు.
🏏 బాల్కు ఉమ్మి రాయడంపై ఇప్పటికే తాత్కాలిక నిషేధం అమల్లో ఉంది. కొవిడ్ పరిస్థితుల్లో ఈ నిబంధన గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అమలు చేస్తున్నారు. ఇప్పుడూ దీన్ని శాశ్వతం చేయడంతో.. ఇకపై బంతికి ఉమ్మిని రాయడం కుదరదు.
🏏 టెస్టులు, వన్డేల్లో ఇన్కమింగ్ బ్యాటర్ రెండు నిమిషాల్లోనే స్ట్రైక్ తీసుకోవడానికి సిద్ధం కావాలి. టీ 20ల్లో ఇందుకోసం ఉన్న 90 సెకన్ల సమయంలో ఎలాంటి మార్పు లేదు.
🏏 బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో.. ఫీల్డింగ్లో ఏదైనా ఉద్దేశపూర్వకమైన, అనైతిక కదలికలు చోటుచేసుకుంటే ఆ బాల్ను డెడ్ బాల్గా ప్రకటిస్తారు. దీంతో అంపైర్ బ్యాటింగ్ జట్టుకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు ఇవ్వొచ్చు.
🏏 ‘మన్కడింగ్’ రూపంలో చేసే రనౌట్ను ఇక మీదట ‘అన్ఫెయిర్ ప్లే’ సెక్షన్ నుంచి ‘రన్ అవుట్’ సెక్షన్లోకి మార్చారు.
🏏 బౌలర్ బాల్ వేయకముందే బ్యాటర్ వికెట్ల నుంచి కాస్త ముందుకు జరిగి ఆడేందుకు ప్రయత్నిస్తే.. బంతిని విసిరి స్ట్రైకర్ను రనౌట్ చేసేవారు. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం చేస్తే దాన్ని డెడ్ బాల్గా ప్రకటిస్తారు.
🏏 టీ20ల్లో జనవరి 2022లో ప్రవేశపెట్టిన మ్యాచ్ పెనాల్టీని వన్డేలకు కూడా అమలు చేయనున్నారు. దీంతో వన్డేల్లోనూ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే.. ఆ మిగిలిన ఓవర్లలో బౌండరీ దగ్గర నుంచి 30 యార్డ్స్ సర్కిల్లోకి ఫీల్డర్ను తీసుకురావాల్సి ఉంటుంది. 2023లో ఐసీసీ పురుషులు వరల్డ్ కప్ లీగ్ పూర్తయిన అనంతరం ఇది అమలులోకి రానుంది.
🏏 బౌలర్ వేసే బంతిని ఆడేటప్పుడు బ్యాట్ కొంత భాగమైనా లేదంటే బ్యాటర్ పిచ్పైనే ఉండాలి. అలా కాకుండా పిచ్ బయటకు వచ్చి ఆడితే.. దానిని డెడ్ బాల్గా పరిగణిస్తారు. ఒకవేళ బౌలర్ వేసిన బంతి బ్యాటర్ను పిచ్ బయటకు రప్పించేలా ఉంటే.. నోబాల్గా ప్రకటిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
టీ20 ప్రపంకప్ కోసం టీమ్ఇండియా రోహిత్ సారథ్యంలో జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్కు డిప్యూటీగా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడు. -
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిణుకుమిణుకుమంటున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. -
ఎవరివో మూడు బెర్తులు?
ఐపీఎల్-17లో కోల్కతా నైట్రైడర్స్కు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
థాయ్లాండ్ టైటిల్పై సాత్విక్ జోడీ గురి
పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. థాయ్లాండ్ ఓపెన్ ప్రపంచ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్పై గురిపెట్టారు. -
నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద, హంపి
భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, కోనేరు హంపి, వైశాలి నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీపడనున్నారు. -
నిఖత్, మీనాక్షి, అనామిక శుభారంభం
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (52 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) అనామిక (50 కేజీలు) శుభారంభం చేశారు. -
అదేం పెద్ద గొడవ కాదు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా మధ్య జరిగింది పెద్ద గొడవేం కాదని ఎల్ఎస్జీ సహాయ కోచ్ లాన్స్ క్లూసెనర్ అన్నాడు. -
వాళ్లు వెళ్లిపోతున్నారు
టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్తో జరిగే టీ20 సిరీస్ కోసం రావాల్సిందిగా ఈసీబీ ఆదేశించడంతో ఐపీఎల్-17లో ఆడుతున్న కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వదేశానికి బయల్దేరుతున్నారు. -
మహిళల షాట్పుట్లో అభా జాతీయ రికార్డు
జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మహిళల షాట్పుట్లో అభా ఖతువా జాతీయ రికార్డు నెలకొల్పింది. -
కుర్రాళ్లూ.. టెస్టు క్రికెట్ ఆడండి
యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడడంపై దృష్టి సారించాలని.. సుదీర్ఘ ఫార్మాట్లో రాణిస్తేనే అసలైన గౌరవం దక్కుతుందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. -
మెరిసిన ‘లక్ష్య’ శ్రీనివాస్
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ సత్తా చాటాడు. -
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
కెప్టెన్ కేఎల్ రాహుల్పై ఆ జట్టు యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై లఖ్నవూ టీమ్ స్పందించింది. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
-
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
-
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు