T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్ వేదిక మారుస్తారా? ఐసీసీ ఏం చెప్పిందంటే..?
T20 World Cup 2024: న్యూయార్క్ పిచ్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్లను మరో చోటుకు మార్చాలంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఐసీసీ స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో న్యూయార్క్ మైదానంలోని పిచ్ (New York Pitch)పై తీవ్ర చర్చ జరుగుతోంది. బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ డ్రాప్ ఇన్ పిచ్ అనూహ్యంగా బౌన్స్ అవుతూ బ్యాటర్లను ఇబ్బందికి గురిచేస్తోంది. మొన్న ఇదే పిచ్పై శ్రీలంక 77 పరుగులకు కుప్పకూలగా.. నిన్న ఐర్లాండ్ను భారత్ 96 ఓవర్లకు ఆలౌట్ చేసింది. దీంతో ఈ పిచ్పై క్రికెట్ నిపుణుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్లో జరగాల్సిన మ్యాచ్ (T20 World Cup 2024)లను మరో వేదికకు మార్చాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జూన్ 9వ తేదీన ఇదే పిచ్పై భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. దీంతో దాయాదుల పోరు ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిణామాల వేళ తాజాగా ఐసీసీ (ICC) స్పందించింది. మ్యాచ్లను తరలించే అవకాశం లేదని తేల్చిచెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ‘‘న్యూయార్క్ గేమ్స్ను ఫ్లోరిడా లేదా టెక్సాస్ వేదికలకు మార్చే ప్రణాళికలు లేవు. భారత్ - పాక్ మ్యాచ్ (India vs Pakistan) కోసం ఇప్పటివరకు ఉపయోగించని పిచ్ను కేటాయించాం. అయితే.. అంతకంటే ముందు ఇతర పిచ్లపై జరిగే మ్యాచ్ల ఫలితాన్ని బట్టి మా నిర్ణయాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంది’’ అని ఐసీసీ అధికారులు చెప్పినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
ఇలాంటి పిచ్లపై ఆడాలంటే... ఇంకా చురుగ్గా ఉండాల్సిందే: జస్ప్రీత్ బుమ్రా
ఇప్పటికే ఈ పిచ్ (New York Pitch) తీరుపై బీసీసీఐ ఆందోళన వ్యక్తంచేసినట్లు వార్తలు వచ్చాయి. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో అనూహ్య బౌన్స్ కారణంగా ఇరు జట్ల బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. రోహిత్ శర్మ భుజానికి స్వల్ప గాయమై రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ దీనిపై స్పందిస్తూ.. ఇలాంటి ప్రమాదకరమైన పిచ్పై టీ20 మ్యాచ్ ఆడటం చాలా కష్టమని ఐసీసీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఇలా కొత్తగా ఏదైనా ట్రాక్ను సిద్ధం చేసినప్పుడు ముందుగా టెస్టింగ్ కోసం ఇతర మ్యాచ్లను నిర్వహించాలని బీసీసీఐ (BCCI) అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటివరకైతే దీనిపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ టోర్నీ (T20 World Cup 2024) కోసం సిద్ధం చేసిన ఈ న్యూయార్క్ స్టేడియంలో మొత్తం 10 టహోమా గ్రాస్ పిచ్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పెరిగే ఈ గడ్డిని ఫ్లోరిడాకు సముద్రమార్గంలో తీసుకొచ్చి అక్కడినుంచి ట్రక్కుల్లో న్యూయార్క్కు తరలించారు. టోర్నీ ప్రారంభానికి కొద్ది వారాల ముందే ఈ డ్రాప్-ఇన్ పిచ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది సీమ్కు బాగానే సహకరిస్తున్నా.. బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతుండటం బ్యాటర్లకు ఇబ్బందిగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి