Archery World Cup 2024: ఆర్చరీ వరల్డ్‌ కప్‌లో భారత్ అద్భుతం.. ఒలింపిక్‌ ఛాంపియన్‌ను ఓడించి స్వర్ణం కైవసం

ఆర్చరీ ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్‌ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది.

Published : 28 Apr 2024 10:37 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆర్చరీ వరల్డ్ కప్‌ 2024లో భారత్‌ మళ్లీ అద్భుతం చేసింది. ఇప్పటికే కాంపౌండ్‌ విభాగంలో మూడు, వ్యక్తిగత విభాగంలో ఒక స్వర్ణాన్ని గెలిచిన టీమ్‌ఇండియా మరో బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది. రికర్వ్‌ విభాగంలో భారత్ 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్, ప్రవీణ్‌ జాదవ్‌తో కూడిన భారత జట్టు ఒలింపిక్‌ ఛాంపియన్‌ దక్షిణ కొరియాపై విజయం సాధించింది. దీంతో భారత్ ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం ఆర్చరీ వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియా ఆరు పతకాలను దక్కించుకుంది. ఇందులో ఐదు స్వర్ణాలు కాగా.. మరొకటి రజతం ఉంది. మహిళల వ్యక్తిగత  రికర్వ్‌ సెమీఫైనల్లో దీపిక.. దక్షిణ కొరియాకు చెందిన ప్రత్యర్థిని ఢీకొట్టనుంది. మిక్స్‌డ్ టీమ్‌ కూడా రికర్వ్‌ విభాగంలో కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. ప్రపంచ నంబర్‌ 3 జ్యోతి వ్యక్తిగత ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. దీంతో తెలుగమ్మాయి అక్టోబరులో మెక్సికోలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని