WI vs IND : కుర్రాళ్లు కుమ్మేశారు.. విండీస్పై భారత్ సూపర్ విక్టరీ
వెస్టిండీస్తో కీలకమైన నాలుగో టీ20లో భారత్ అదరగొట్టింది. విండీస్పై టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేసింది.
లాడర్హిల్ (ఫ్లోరిడా): వెస్టిండీస్తో కీలకమైన నాలుగో టీ20లో భారత్ అదరగొట్టింది. విండీస్పై టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేసింది. కరీబియన్ జట్టు నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 17 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. తొలి మూడు టీ20ల్లో నిరాశపర్చిన శుభ్మన్ గిల్ (77; 47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లు) ఈ సారి తనదైన శైలిలో చెలరేగి ఆడాడు. అరంగేట్ర మ్యాచ్లో ఒకే పరుగు చేసి వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ (84*; 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు) తన రెండో మ్యాచ్లో దంచికొట్టి టీ20ల్లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తొలుత విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెట్మయర్ (61; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకం బాదాడు. షై హోప్ (45; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 ఆదివారం జరగనుంది.
లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడారు. మెకాయ్ వేసిన తొలి ఓవర్లో బంతిని రెండు సార్లు బౌండరీకి పంపించిన యశస్వి.. హోల్డర్ బౌలింగ్లో మూడు ఫోర్లు బాదాడు. తర్వాత గిల్ జోరందుకున్నాడు. మెకాయ్ వేసిన నాలుగో ఓవర్లో ఓ సిక్సర్ బాదిన అతడు.. ఒడియన్ స్మిత్ బౌలింగ్లో 6,4 దంచేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 66/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్లిద్దరూ నిలకడగా ఆడటంతో 10 ఓవర్లకు స్కోరు 100కు చేరింది. రోవ్మన్ పావెల్ తర్వాతి ఓవర్లోనే ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. గిల్ 30 బంతుల్లో, యశస్వి 33 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నారు.
అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా వీరి జోరు కొనసాగింది. అకీల్ హోసీన్ బౌలింగ్లో యశస్వి సిక్స్ బాదగా.. స్మిత్ వేసిన 13 ఓవర్లో చెరో సిక్స్ రాబట్టారు. మెకాయ్ వేసిన 14 ఓవర్లో చివరి రెండు బంతులకు యశస్వి వరుసగా 4,6 బాదాడు. షెఫర్డ్ బౌలింగ్లో సిక్స్ బాదిన గిల్.. అదే ఓవర్లో షై హోప్కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే భారత్ విజయానికి చేరువైంది. తిలక్ (7*)తో కలిసి యశస్వి జైస్వాల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
-
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
-
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
-
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!