IPL 2024 Auction: ఐపీఎల్ వేలం.. సొమ్మెంత? ఎప్పుడు? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఐపీఎల్ వేలంలో (IPL) కాసుల పంట పండించే సమయం ఆసన్నమైంది. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 కోసం ప్లేయర్ల వేలానికి ఏర్పాట్లు జరిగాయి. దేశ, విదేశీ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే వేలంలోకి వచ్చిన ఆటగాళ్ల జాబితాను కూడా ఐపీఎల్ నిర్వాహకులు విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుంది?
ఐపీఎల్ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానుంది. ఇది 17వ ఐపీఎల్ వేలం. గతేడాది డిసెంబర్లోనూ చివరిసారిగా వేలం జరిగింది.
లైవ్ ఎలా?
ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని నిర్వాహకులు లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు. స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్, జియో సినిమా ఓటీటీలో వీక్షించవచ్చు.
ఎంతమంది అందుబాటులో ఉన్నారు?
తొలుత 1,166 మంది ప్లేయర్లు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, ఐపీఎల్ నిర్వాహకులతోపాటు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిన 333 మందితో కూడిన తుది జాబితాను విడుదల చేశారు.
ఎన్ని స్లాట్లు? అందులో ఓవర్సీస్ ఎన్ని?
పది ఫ్రాంచైజీలు దక్కించుకొనేందుకు 77 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులోనూ విదేశీ ఆటగాళ్ల స్లాట్లు 30 ఉన్నాయి. అయితే, మొత్తం 333 మందిలో 119 మంది విదేశీయులున్నారు.
అందుబాటులో ఉన్న సొమ్మెంత?
ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు పది ఫ్రాంచైజీలు కలిపి రూ. 262.95 కోట్లు వెచ్చించనున్నాయి. ఇందులో అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 38.15 కోట్లు ఉండగా.. అత్యల్పంగా లఖ్నవూ సూపర్ జెయింట్స్ వద్ద రూ. 13.15 కోట్లు మాత్రమే ఉన్నాయి. సన్రైజర్స్ వద్ద రూ.34 కోట్లు ఉండటం విశేషం.
డిమాండ్ వీరికే..
ఈ వేలంలో భారీ ధరను దక్కించుకునే అవకాశం ఉన్న వారిలో విదేశీ ప్లేయర్లే అధికంగా ఉన్నారు. ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర, స్టార్క్, కొయిట్జీ తదితరులు రేసులో ఉన్నారు. టాప్ ప్లేయర్ల జాబితా కోసం క్లిక్ చేయండి
పిన్న వయస్కుడు.. సీనియర్ ప్లేయర్ ఎవరంటే?
దక్షిణాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల క్వేనా మఫాకా పిన్న వయస్కుడు కాగా.. అఫ్గాన్కు చెందిన మహమ్మద్ నబీ అత్యధిక వయస్కుడు. నబీకి ప్రస్తుతం 38 ఏళ్లు.
వేలం నిర్వహణ ఎవరంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలం నిర్వహించిన మల్లికా సాగర్ ఈ ఐపీఎల్ వేలం కూడా నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
ద్రవిడ్ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కోచ్ పదవి నుంచి వైదలగాలని భావిస్తున్నాడు. కనీసం టెస్టు జట్టుకు కూడా అతడు కోచ్గా ఉండేందుకు నిరాకరించినట్లు సమాచారం. -
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ - సంజీవ్ గోయెంకా సంభాషణ వైరల్గా మారిపోయింది. ఆ పరిణామాలపై లఖ్నవూ కోచ్ స్పందించాడు. -
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
లఖ్నవూకు ఈ సీజన్లో ఏడో ఓటమి ఎదురైంది. ప్లేఆఫ్స్కు వెళ్దామనే ఆశలకు బ్రేక్ పడేలా ఉంది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్
హార్దిక్ నాయకత్వంపై విమర్శలు చేసిన విదేశీ మాజీ క్రికెటర్లను గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. ఐపీఎల్లో ఆ ఇద్దరి పాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సెమీస్లో గౌరవ్
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మాతృవియోగం
-
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
-
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
-
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
-
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్