Rohit Sharma: ఐపీఎల్లో 10 రకాల కెమెరా యాంగిల్స్ ఉంటాయి.. ఇక్కడెందుకు లేవో?: రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఘోర ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ను థర్డ్ అంపైర్ క్యాచ్ ఔట్గా ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)లో టీమ్ఇండియా (Team India) ఘోర ఓటమిపాలైంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి డబ్ల్యూటీసీ గదను దక్కించుకుంది. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill)ను థర్డ్ అంపైర్ క్యాచ్ ఔట్గా ప్రకటించడం వివాదాస్పదమైంది. బోలాండ్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ తొలి బంతి గిల్ బ్యాట్ను తాకి స్లిప్లో ఉన్న గ్రీన్ దగ్గర పడేలా కనిపించింది. కానీ, గ్రీన్ డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. ఆ బంతి నేలకు తాకిందో లేదో అనే సందేహంలో ఉన్న అంపైర్లు.. టీవీ అంపైర్ రిచర్డ్ కెటిల్బోరోకు నిర్ణయాన్ని వదిలేశారు. చాలాసేపు పరీక్షించిన తర్వాత బంతి కింద గ్రీన్ చేతి వేళ్లు ఉన్నాయని భావించి ఆ అంపైర్ ఔటిచ్చాడు. కానీ కొన్ని రిప్లేల్లో చూస్తే బంతి నేలకు తాకిందని స్పష్టంగా కనిపించింది. అంపైర్ గిల్ ఔట్గా ప్రకటించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది భారత మాజీ ఆటగాళ్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ (Rohit Sharma) శుభ్మన్ గిల్ క్యాచ్ గురించి కూడా స్పందించాడు.
‘‘థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంతో నేను నిరాశ చెందాను. అతను మరిన్ని రీప్లేలు చూడాల్సి ఉంది. మూడు లేదా నాలుగుసార్లు చూసి ఆ నిర్ణయం తీసుకున్నట్లున్నాడు. అది ఔటా? నాటౌటా అనే విషయం పక్కన పెడదాం. ఏ విషయమైనా దాని గురించి సరైన, స్పష్టమైన సమాచారం కలిగి ఉండాలి. క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్ తొందరగా నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి క్యాచ్ విషయంలో 100 శాతం కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఫైనల్. మరిన్ని కెమెరా యాంగిల్స్ ఉండాలి. ఒకటి, రెండు కెమెరా యాంగిల్స్ మాత్రమే చూపించారు. ఐపీఎల్లో 10 రకాల కెమెరా యాంగిల్స్ ఉండటం మనం చూశాం. ఇంత పెద్ద మ్యాచ్లో అలాంటి ఏర్పాట్లు ఎందుకు లేవో నాకు తెలియదు. ఈ విషయంలో నేను కొంచెం నిరాశ చెందా’’ అని రోహిత్ శర్మ అన్నాడు. అదే విధంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విజేతను నిర్ణయించడం కోసం ఒక మ్యాచ్ కాకుండా మూడు మ్యాచ్ల సిరీస్ను నిర్వహించాలని రోహిత్ శర్మ ఐసీసీకి సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే దిల్లీ, బెంగళూరుకు ఈ విజయం కీలకమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది. -
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండటానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. నాణ్యమైన ఇన్నింగ్స్లతో ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ