Ishan Kishan-Shreyas Iyer: ఇషాన్, శ్రేయస్లపై వేటు.. కాంట్రాక్టుల నుంచి తొలగించనున్న బీసీసీఐ..?
Ishan Kishan-Shreyas Iyer: హెచ్చరికలను పెడచెవిన పెట్టి రంజీలకు దూరంగా ఉంటున్న ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై బీసీసీఐ చర్యలకు సిద్ధమైంది. వారి కాంట్రాక్టులను రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు (Team India)కు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలపై అనాసక్తి చూపిస్తుండటం తీవ్ర చర్చకు దారితీసింది. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్ (Ishan Kishan), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఎలాంటి సహేతుకమైన కారణాల్లేకుండానే రంజీలు ఆడకపోవడాన్ని బీసీసీఐ (BCCI) తీవ్రంగా పరిగణించింది. ఈక్రమంలోనే వారిపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టుల (Central Contracts) జాబితా నుంచి వీరిద్దరినీ తొలగించనున్నట్లు సమాచారం.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు.. 2023-24 సీజన్కు గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్ల తుది జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలోనే బీసీసీఐ దీనిపై ప్రకటన చేయనుంది. అయితే, ఈ జాబితా నుంచి ఇషాన్, శ్రేయస్లను తొలగించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ హెచ్చరికలను పట్టించుకోకుండా దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉండటం వల్లే వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. 2022-23 సీజన్లో వీరిద్దరికీ బీసీసీఐ కాంట్రాక్టులిచ్చింది. సి-కేటగిరీలో ఇషాన్ ఏడాదికి రూ.కోటి, బి-కేటగిరీలో శ్రేయస్ రూ.3 కోట్లు అందుకున్నాడు.
బీసీసీఐ అల్టిమేటం వేళ.. హార్దిక్తో ఇషాన్ జిమ్ వీడియో వైరల్
మానసిక అలసటకు గురయ్యానంటూ గత డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో టీమ్ఇండియాకు దూరమైన ఇషాన్ అప్పటినుంచి ఏ మ్యాచ్లూ ఆడటం లేదు. రంజీలకు ఆడాలని బోర్డు గట్టిగా చెప్పినా.. ఏమాత్రం పట్టించుకోలేదు. తాజాగా అతడు హార్దిక్ పాండ్యతో కలిసి జిమ్లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది.
అటు శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో ఫిట్నెస్ సాధించిన తర్వాత రంజీల్లో ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే వెన్ను నొప్పి అని చెప్పి అతడు రంజీ మ్యాచ్కు డుమ్మా కొట్టాడు. కానీ, జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం శ్రేయస్ పూర్తి ఫిట్గా ఉన్నాడని చెప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో బిల్గేట్స్ అల్లుడు నాయెల్ నాజర్ పోటీ పడుతున్నాడు. -
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు