Ind-Kiwis: భారత్తో టీ20 సిరీస్కు కేన్ దూరం.. కివీస్కు కొత్త కెప్టెన్
యూఏఈలో టీ20 ప్రపంచకప్ ఆడిన కివీస్ నేరుగా టీమ్ఇండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది....
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 17 (బుధవారం) నుంచి న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. యూఏఈలో టీ20 ప్రపంచకప్ ఆడిన కివీస్ నేరుగా భారత్కు వచ్చేసింది. టీమ్ఇండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. అయితే భారత్తో జరిగే మూడు టీ20ల సిరీస్కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. మళ్లీ నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు కేన్ జట్టులో చేరతాడు. ‘‘కివీస్ కెప్టెన్ కేన్ ఈ వారం అందుబాటులో ఉండడు. నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టు సన్నద్ధత కోసం విశ్రాంతి తీసుకుంటాడు. అందుకే మూడు టీ20ల సిరీస్కు దూరం కానున్నాడు’’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దీంతో టిమ్ సౌథీ నాయకత్వంలోని టీ20 జట్టును కివీస్ క్రికెట్ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్కు చేరుకున్న కివీస్.. ఆసీస్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.
‘‘బుధవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్కు టిమ్ సౌథీ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. కేల్ జేమీసన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాట్నర్ రెండు ఫార్మాట్ల సిరీస్లకు అందుబాటులో ఉంటారు. లాకీ ఫెర్గూసన్ వేగంగా కోలుకుంటున్నాడు. టీ20 సిరీస్కు అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నాం’’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. కివీస్-భారత్ జట్ల మధ్య జయపుర వేదికగా నవంబర్ 17న తొలి టీ20, రాంచీ మైదానంలో నవంబర్ 19న రెండో టీ20, కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా 21 (ఆదివారం) ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టు నవంబర్ 25-29, రెండో టెస్టు డిసెంబర్ 3-7 వరకు జరుగుతాయి. సోమవారం సాయంత్రం జయపురకు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టింది. మరోవైపు టీ20 ఫార్మాట్కు కెప్టెన్సీని వదిలిపెట్టిన విరాట్ కోహ్లీ సిరీస్కూ అందుబాటులో ఉండడు. విరాట్ బదులు రోహిత్ శర్మను టీ20 సారథిగా బీసీసీఐ నియమించింది.
న్యూజిలాండ్ టీ20 జట్టు : టాడ్ ఆస్టల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాంపన్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, కేల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాట్నర్, టిమ్ సీఫర్ట్, ఐష్ సోధి, టిమ్ సౌథీ (కెప్టెన్)
భారత్ జట్టు: రోహిత్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, చాహల్, ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్, అవేష్ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
పదమూడు దేశాల్లో ‘నోటా’..!
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం