MS Dhoni: ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17 సీజన్లలో విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది మంది క్రికెటర్లలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) ముందుంటాడు. చెన్నై జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడానికి కూడా కారణం అతడే. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన సారథి. ప్రస్తుతం 42 ఏళ్ల వయసులోనూ మునుపటి ‘ఫినిషింగ్’ టచ్ ఇస్తున్న ధోనీ సక్సెస్ వెనుక కారణం ఏంటా? అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. గతంలో స్వయంగా అతడే వెల్లడించిన పాత వీడియోను ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది.
‘‘ఇప్పుడు నేను చెప్పే సమాధానం కొందరికి అసంబద్ధంగా ఉండొచ్చేమో. కానీ, చాన్నాళ్లుగా నేను ఫాలో అవుతున్న టైమ్ టేబుల్ ఇదే. అదే నాకు సాయంగా నిలిచింది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ఐదారు రోజుల ముందు నుంచే మానసికంగా సిద్ధమవుతా. ఒక్కోసారి రాత్రి 12 తర్వాత మేం మళ్లీ ఫ్లైట్ను అందుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతిసారి నేను ఆలస్యంగా నిద్ర పోవాల్సిన పరిస్థితి. మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత కిట్ బ్యాగ్ను సిద్ధం చేసుకోవాలి. ఆలస్యంగా డిన్నర్ చేయాలి. దీంతో హోటల్ గదికి చేరుకునే సరికి ఒక్కోసారి 1.15 అయిపోతుంది. అక్కడ వస్తువులను ప్యాక్ చేసుకోవాలి. దీంతో 2.30 అయిపోతుంది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటలకు పడుకొని ఆరింటికల్లా నిద్రలేస్తుంటారు. నేను మాత్రం 3 గంటలకు పడుకొని ఉదయం 11 గంటలకు లేస్తా. కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటా. మ్యాచ్లు లేనప్పుడు సరైన సమయానికి పడుకొంటా. కాబట్టి, ఐపీఎల్ ముగిసినా నాకు అలసట అనిపించదు’’ అని ధోనీ తెలిపాడు.
హైదరాబాద్తో చెన్నై ఢీ
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్తో తన సొంతమైదానం చెపాక్లో చెన్నై తలపడనుంది. ఉప్పల్ మ్యాచ్లో చెన్నైకు ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. దీంతో ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తోంది. మరోవైపు ప్లేఆఫ్స్ రేసులో హైదరాబాద్ మూడో స్థానంలో (10 పాయింట్లు), చెన్నై (8 పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడీ మ్యాచ్లో సన్రైజర్స్ గెలిస్తే రెండో స్థానంలోకి వెళ్తుంది. చెన్నై కూడా భారీ విజయం సాధిస్తే సెకండ్ ప్లేస్లోకి వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై తమ సొంతమైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. ధోనీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే దిల్లీ, బెంగళూరుకు ఈ విజయం కీలకమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది. -
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండటానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. నాణ్యమైన ఇన్నింగ్స్లతో ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
రెంటచింతలలో వైకాపా నేతల దాడి.. పలువురికి గాయాలు
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు