Shubman Gill: ఎలా ఆడాలనేది అతడు చెప్పాడు.. వారి వల్లే మా విజయం: శుభ్మన్ గిల్
ఓ మోస్తరు స్కోరును కాపాడుకొని గుజరాత్ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హార్దిక్ పాండ్య నాయకత్వంలోని ముంబయి ఓటమిపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐదు సార్లు ఛాంపియన్ ముంబయిపై గుజరాత్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హార్దిక్ నాయకత్వంలో ముంబయి జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి బంతి వరకూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ పోరాటం ఆకట్టుకుంది. ఒక దశలో ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో గుజరాత్ బౌలర్లు పుంజుకున్న తీరు అద్భుతం. మరీ ముఖ్యంగా పేసర్లతోపాటు స్పిన్నర్ల వల్లే విజయం సాధించగలిగామని గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్లో మరో 15 పరుగులు చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
‘‘మంచు ప్రభావం ఉన్న సమయంలోనూ మా బౌలర్లు అదరగొట్టారు. ముంబయి బ్యాటర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగారు. స్పిన్నర్ల వల్లే రేసులో నిలవగలిగాం. పేసర్లూ కీలకమైన సమయంలో రాణించి వికెట్లు తీసి గెలిపించారు. ముంబయి బ్యాటర్లు పొరపాట్లు చేసేవరకు వేచి చూశాం. అయితే, మేం బ్యాటింగ్లో మరో 15 పరుగులు చేయాల్సింది. సాయి సుదర్శన్ మాకు బ్యాటింగ్ ఎలా చేయాలో చేసి చూపించాడు. స్కోరు బోర్డుపై మంచి లక్ష్యమే నిర్దేశించగలిగాం. మా జట్టును ప్రోత్సహించడానికి అభిమానులు భారీ సంఖ్యలో రావడం ఆనందంగా ఉంది. ప్రతిసారీ మద్దతు అద్భుతం. ఇదే ఆటతీరును మున్ముందు మ్యాచుల్లో ప్రదర్శించి విజయాలు సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అని గిల్ వ్యాఖ్యానించాడు.
అక్కడ వెనుకబడ్డాం: హార్దిక్ పాండ్య
‘‘లక్ష్య ఛేదనలో దగ్గరగా వచ్చాం. కానీ, చివరి 42 పరుగులు చేసే క్రమంలో ఒక్కసారిగా తడబాటుకు గురయ్యాం. ఐదు ఓవర్లలోనే పూర్తి చేయాల్సింది. కానీ, చివరి ఓవర్ వరకూ తీసుకెళ్లి మ్యాచ్ను చేజార్చుకున్నాం. అహ్మదాబాద్ స్టేడియానికి రావడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు భారీ సంఖ్యలో మ్యాచ్ను చూడటానికి వస్తారు. రషీద్ ఖాన్ బౌలింగ్లో తిలక్ వర్మ సింగిల్ తీయకపోవడం మంచి నిర్ణయమే. అతడికి నా మద్దతు ఉంది. ఈ టోర్నీలో ఇంకా 13 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. తప్పకుండా ఛాంపియన్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తాం’’ అని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య తెలిపాడు.
తొలి ఇన్నింగ్స్లో ఆడటం చాలా కష్టమైంది: సాయి సుదర్శన్
‘‘ఛేదనతో పోలిస్తే తొలి ఇన్నింగ్స్లో ఆడటం చాలా కష్టంగా ఉందనిపించింది. మంచు ప్రభావం వల్ల ముంబయి బ్యాటర్లు కొన్ని షాట్లు కొట్టేందుకు అవకాశం ఉంది. అయితే, మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. తొలుత బ్యాటింగ్ చేసేటప్పుడు జట్టు విజయం కోసం అవసరమైన పరుగులు రాబడితే చాలనుకున్నా. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్తో కీలక పాత్ర పోషించిన బౌలర్లు ఉన్నారు. అనూహ్యంగా నాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడం ఆశ్యర్యంగా ఉంది’’ అని సాయి సుదర్శన్ పేర్కొన్నాడు. గుజరాత్ 168 పరుగులు చేయడంలో సాయి కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. దీంతో అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!