Sakshi Dhoni: ‘బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే’... సాక్షి ధోనీ ఇన్‌స్టా స్టోరీ వైరల్‌

ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్‌. తాజాగా ఆమె పెట్టిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.

Published : 29 Apr 2024 08:40 IST

ఇంటర్నెట్ డెస్క్: చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై చెన్నై 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్కే 212/3 స్కోరు చేసింది. అనంతరం సన్‌రైజర్స్‌ 134 పరుగులకే ఆలౌటైంది. చెన్నై బౌలర్‌ తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో ఎస్‌ఆర్‌హెచ్‌ నడ్డి విరిచాడు. 16 ఓవర్లకే హైదరాబాద్‌ కీలకమైన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

‘‘ప్లీజ్‌ ఇవాళ మ్యాచ్‌ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే. కాబోయే అత్తగా నా రిక్వెస్ట్‌ ఇదే’’ అని సాక్షి తన ఇన్‌స్టా గ్రామ్‌ స్టోరీస్‌ పెట్టింది. దీంతో ధోనీ అభిమానులంతా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ధోనీ మామ కాబోతున్నాడంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని