Team India captaincy: అప్పుడు కోహ్లీని కోరలేదు.. రోహిత్ బెస్ట్ అనిపించాడు: గంగూలీ
వన్డే ప్రపంచకప్లో (ODI WORLD CUP 2023) భారత్ రాణిస్తుందనే నమ్మకం ఉందని.. రోహిత్ శర్మ సారథ్యంలో విజేతగా నిలుస్తామని మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేర్కొన్నాడు. అలాగే, విరాట్ కెప్టెన్సీ వ్యవహారంపైనా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ మూడు టెస్టుల సిరీస్ను 1-2 తేడాతో ఓడిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పటికే కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతలను వదిలేయగా.. వన్డే కెప్టెన్సీకి బీసీసీఐ దూరం చేసింది. దక్షిణాఫ్రికాపై ఓటమితో టెస్టు సారథ్యానికీ విరాట్ కోహ్లీ (Virat Kohli) గుడ్బై చెప్పేశాడు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీతో విభేదాలు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇరువురి మధ్య మాటల యుద్ధం కూడా చోటుచేసుకుంది. ఇటీవల ఐపీఎల్ సీజన్లోనూ ఓ మ్యాచ్ సందర్భంగా గంగూలీతో కరచాలనం చేయడానికి కూడా విరాట్ విముఖత ప్రదర్శించాడు. అయితే, ఐపీఎల్లో బెంగళూరు - దిల్లీ చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ కలవడంతో ఆ వివాదానికి తెరపడినట్లైంది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగానూ విరాట్తో గంగూలీ చిట్చాట్ చేశాడు.
భారత్ వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమిని చవిచూసింది. దీంతో టెస్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించాలనే డిమాండ్లూ వచ్చాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగడంపై మరోసారి గంగూలీ స్పందించాడు. అలాగే, బీసీసీఐ ఎప్పుడూ కూడా టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని విరాట్ను కోరలేదని కూడా స్పష్టం చేశాడు. ‘‘విరాట్ టెస్టు కెప్టెన్సీని త్యజించినప్పుడు బీసీసీఐ సన్నద్ధంగా కూడా లేదు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత అలా ఎందుకు చేశాడో నాకైతే తెలియదు. కేవలం కోహ్లీ మాత్రం చెప్పగలడు. అయితే, విరాట్ కెప్టెన్సీని వదిలేసిన తర్వాత రోహిత్ శర్మనే సరైన ఎంపికగా మేం భావించాం. ఆ సమయంలో అతడే కరెక్ట్ అనిపించింది. విరాట్ అద్భుతమైన నాయకుడు. రవిశాస్త్రి-విరాట్ ఆధ్వర్యంలో టీమ్ఇండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఇంగ్లాండ్, ఆసీస్ గడ్డపై నిర్భయంగా క్రికెట్ ఆడారు’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
అది పెద్ద కష్టమేం కాదు
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడి ఐసీసీ ట్రోఫీని దూరం చేసుకున్నప్పటికీ.. వన్డే ప్రపంచకప్లో రోహిత్ సారథ్యంలోని భారత్ తప్పకుండా రాణిస్తుందనే నమ్మకం ఉందని గంగూలీ తెలిపాడు. ‘‘రోహిత్ నాయకత్వంలో ముంబయి ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలిచింది. రోహిత్పై పూర్తి నమ్మకం ఉంది. అతడు, ధోనీ మాత్రమై ఐదేసి కప్లను గెలిచారు. ఐపీఎల్ టోర్నీలో విజేతగా నిలవడం చాలా కష్టమే. పద్నాలుగేసి లీగ్ మ్యాచ్లు, ప్లేఆఫ్స్ ఆడి మరీ ఛాంపియన్గా నిలవాలి. అదే, ప్రపంచ కప్లో నాలుగైదు విజయాలు సాధిస్తే సెమీస్కు వెళ్లిపోవచ్చు. అందుకే, ప్రపంచకప్ను గెలవడం కంటే ఐపీఎల్ విజేతగా నిలవడమే కష్టమని చెబుతా’’ అని గంగూలీ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై తమ సొంతమైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. ధోనీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే దిల్లీ, బెంగళూరుకు ఈ విజయం కీలకమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది. -
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండటానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. నాణ్యమైన ఇన్నింగ్స్లతో ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు