WI vs IND: వారి ప్రదర్శనపైనే దృష్టి.. ఈసారి హార్దిక్ నిర్ణయాలు ఎలా ఉంటాయో?
వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్లో (WI vs IND) భారత్ 0-2 తేడాతో వెనుకబడి ఉంది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడి సిరీస్ను ప్రమాదంలో పడేసింది. మూడో టీ20లోనైనా గెలిచి రేసులో నిలవాలి.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2023) కోసం జట్టును సిద్ధం చేయడంపై దృష్టిపెట్టిన భారత్కు (Team India) ఏదీ కలిసిరావడం లేదు. ఆటగాళ్ల ఎంపిక నుంచి వారిని సరిగ్గా వినియోగించుకోవడం వరకు తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వెస్టిండీస్తో పొట్టి సిరీస్లోనూ భారత ప్రదర్శన నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఐపీఎల్లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తొలిసారే గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్గా నిలిపిన హార్దిక్ పాండ్య (Hardik Pandya).. విండీస్తో సిరీస్లో తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు మూడో మ్యాచ్లోనైనా లోటుపాట్లను సరి చేసుకుని బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. లేకపోతే సిరీస్ రేసు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
గిల్ - సంజూ పరిస్థితేంటి?
మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియాకు కీలక బ్యాటర్గా ఎదిగిన శుభ్మన్ గిల్ విండీస్తో టీ20 సిరీస్లో మాత్రం తేలిపోతున్నాడు. తొలి మ్యాచ్లో 3, రెండో టీ20లో 7 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ తన అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. సంజూ శాంసన్ కూడా 12, 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక రిజర్వ్ బెంచ్పై యశస్వి మాత్రమే బ్యాటర్. దీంతో గిల్ - సంజూలో ఒకరిని పక్కన పెట్టేసి యశస్వికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఇషాన్, సూర్యకుమార్ కూడా తన స్థాయి ఆటతీరును ప్రదర్శించడం లేదు. యువ ఆటగాడు తిలక్ వర్మ మాత్రమే అదరగొట్టేశాడు.
హార్దిక్.. ఎందుకు ఇలా?
నాణ్యమైన బౌలింగ్ వేస్తున్న యుజ్వేంద్ర చాహల్తో పూర్తి ఓవర్లను వేయించలేదు. అక్షర్ పటేల్ను తీసుకున్నప్పటికీ అతడికి బౌలింగ్ ఇవ్వలేదు. మరోవైపు గొప్పగా రాణించలేకపోతున్న ముకేశ్ కుమార్తో మాత్రం బౌలింగ్ చేయించాడు. రిజర్వ్ బెంచ్లో తన అవకాశం కోసం ఎదురు చూస్తున్న అవేశ్ ఖాన్ను ఆడిస్తే ఏమైనా మార్పు ఉండొచ్చు. హార్దిక్ కూడా వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులను నియంత్రించడంలో విఫలం కావడం గమనార్హం. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్, రోవ్మన్ పావెల్ మరింత ప్రమాదకారులు. వారిని ఔట్ చేసేందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని మిస్ చేయకూడదు. అయితే, రెండో టీ20లో బిష్ణోయ్ బౌలింగ్లో రోవ్మన్ ఎల్బీ అయ్యేవాడు. కానీ, డీఆర్ఎస్ తీసుకోవడంలో భారత్ విఫలమైంది. కెప్టెన్గా హార్దిక్ తన బౌలర్లపై కాస్త నమ్మకం ఉంచి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
పిచ్ పరిస్థితి.. మ్యాచ్ షెడ్యూల్
రెండో టీ20 మాదిరే ఈ మ్యాచ్లోనూ పిచ్ మందకొడిగా ఉండే అవకాశం ఉంది. బౌలర్లకే ఎక్కువ సహకరించొచ్చు. చిన్న బౌండరీలు కావడంతో భారీ షాట్లు ఆడటం బ్యాటర్లకు సులభంగా ఉండొచ్చు. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. జియో సినిమా, ఫ్యాన్కోడ్ ఓటీటీల్లో వీక్షించే అవకాశం ఉంది.
జట్లు (అంచనా):
భారత్: ఇషాన్, శుభ్మన్, సూర్యకుమార్, తిలక్, శాంసన్, హార్దిక్, అక్షర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్, చాహల్, అవేష్ ఖాన్
వెస్టిండీస్: కింగ్, మేయర్స్, ఛార్లెస్, పూరన్, పావెల్, హెట్మయర్, షెఫర్డ్, హోల్డర్, అకీల్, అల్జారి జోసెఫ్, మెకాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా, ముంబయి జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. -
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
41 ఏళ్ల ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్తో తనకు బలమైన బంధం ఉందని గంభీర్ వెల్లడించాడు. ఏ నిర్ణయం తీసుకొన్నా జట్టు శ్రేయస్సు కోసమేనని అతడు నమ్ముతాడన్నాడు. -
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్లో చెన్నై మ్యాచ్లను చూసేందుకు వస్తున్నారు. అతడు కూడా వారిని నిరాశపర్చకుండా దూకుడుగా ఆడేస్తున్నాడు. -
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్
హార్దిక్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వస్తున్న క్రమంలో ముంబయి బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ సారథి అత్యుత్తమమని వ్యాఖ్యానించాడు. -
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
ఐపీఎల్ 17వ సీజన్లో వేటు ఎదుర్కొన్న తొలి ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నేరానికి పాల్పడటంతో సస్పెన్షన్ తప్పలేదు. -
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
మరో కీలక పోరులో ముంబయిని ఢీకొట్టేందుకు కోల్కతా సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి గౌతమ్ గంభీర్కు ప్రత్యేక విజ్ఞప్తి అందింది. -
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
ప్రస్తుత ఎడిషన్లో నాకౌట్ దశకు చేరుకొనే జట్టు ఏంటనేది ఇంకా తెలియలేదు. టాప్-4లోకి వస్తాయని అనుకుంటున్న జట్లకు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్లు షాక్లు ఇస్తున్నాయి. -
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
ఒక్క మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్పై ఫ్రాంచైజీ యజమాని అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ అనుభవం కేఎల్ రాహుల్కు ఎదురైంది. -
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
గెలిచామనే ఆనందం గుజరాత్కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
ఐపీఎల్కు రోహిత్ గుడ్బై చెప్పనున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలైంది. దీనంతటికి కేకేఆర్ పోస్టు చేసిన ఓ వీడియో కారణమైంది. -
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్