USA vs PAK: వారికి ప్రేక్షకుల మద్దతూ ఎక్కువే.. యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్
చిన్న జట్టుగా వచ్చిన యూఎస్ఏ.. సంచలనం నమోదు చేసిన క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. పాక్కు షాక్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2024లో (T20 World Cup 2024) తొలి సంచలనం నమోదైంది. బలమైన పాకిస్థాన్ను యూఎస్ఏ చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. సూపర్ ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్లో అమెరికానే విక్టరీ సాధించింది. బాబర్ అజామ్ నాయకత్వంలోని పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. పాక్పై కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన యూఎస్ఏ సారథి మోనాంక్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అమెరికన్ టీమ్.. అంత ఈజీ కాదు!
‘‘మేం మ్యాచ్ను సరైన సమయంలోనే ముగించామని భావిస్తున్నా. అదనంగా సూపర్ ఓవర్ ఆడినట్లు అనిపించలేదు. మేం 18 పరుగులు చేయడంతో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అవకాశం దక్కింది. దానిని డిఫెండ్ చేసుకోవడం కష్టమేం కాదు. మ్యాచ్ మధ్యలో సహచరులం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పుడూ ఒత్తిడిగా భావించలేదు. అసలు ఒత్తిడంతా పాక్పైనే ఉంటుంది. మాకు ఈసారి అనుకున్నంత మేర మద్దతు లేదని తెలుసు. ప్రేక్షకుల నుంచి పాక్కే ఎక్కువ సపోర్ట్ లభించింది. ఇదే ఆ జట్టును దెబ్బతీసింది. మేం నాణ్యమైన క్రికెట్ను ఆడటంతో ఇంకాస్త అదనంగా పాక్ ఒత్తిడికి గురైంది. తొలి ఆరు ఓవర్లలో మేం బౌలింగ్ చేసిన విధానం అద్భుతం.
పాక్కు ‘సూపర్’ షాకిచ్చిన ముంబయి ఇంజినీర్.. ఎవరీ సౌరభ్ నేత్రావల్కర్?
పాక్తో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాం. వాటిని మైదానంలో అమలుపరిచాం. టాస్ నెగ్గగానే తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. తొలి అర్ధభాగం బౌలర్లకు సహకరిస్తుందని మాకు తెలుసు. పవర్ ప్లేలోనే కీలకమైన వికెట్లను తీయడంతో పైచేయి సాధించాం. 160 పరుగుల టార్గెట్ను సాధించడం పెద్ద కష్టమేం కాదని భావించాం. ఒకవైపు బౌండరీ చిన్నదిగా ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకున్నాం. సౌరభ్, అలీఖాన్, నితీశ్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించారు. చివర్లో అవసరమైతే కోరే అండర్సన్ సిద్ధంగా ఉంటాడు. అతడిని చివరి మూడు ఓవర్లలో బ్యాటింగ్కు పంపాలని ప్లాన్ చేసుకున్నాం. అయితే, పాక్ బౌలర్లూ మమ్మల్ని కట్టడి చేయడంతో సూపర్ ఓవర్కు మ్యాచ్ వెళ్లింది’’ అని మోనాంక్ తెలిపాడు.
సౌరభ్ నేత్రావల్కర్ టెక్ దిగ్గజం స్పెషల్ పోస్టు
పాకిస్థాన్పై యూఎస్ఏ విజయం సాధించడంలో సౌరభ్ నేత్రావల్కర్ కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 2 వికెట్లు తీసిన సౌరభ్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈసందర్భంగా సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం అతడు ఒరాకిల్ (Oracle)లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఉంది. ఈక్రమంలో ఒరాకిల్ కూడా స్పెషల్ పోస్టు పెట్టింది. ‘‘ యూఎస్ఏ క్రికెట్ టీమ్కు శుభాకాంక్షలు. జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉంది. మా ఇంజినీర్ - క్రికెట్ స్టార్ సౌరభ్ అద్భుతంగా ఆడాడు’’ అని పోస్టు పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి