WI vs INDIA: శతక్కొట్టిన కోహ్లీ.. రాణించిన అశ్విన్.. ప్రతిఘటిస్తున్న విండీస్
తొలి టెస్టులో భారత బౌలర్ల ధాటికి చిత్తుగా ఓడిన విండీస్.. రెండో టెస్టులో మాత్రం ప్రతిఘటిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 86/1 స్కోరుతో నిలిచింది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: తొలి టెస్టులో భారత బౌలర్ల ధాటికి రెండు ఇన్నింగ్స్ల్లోనూ తక్కువ స్కోరుకే ఆలౌటై ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడిన విండీస్.. రెండో టెస్టులో మాత్రం ప్రతిఘటిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్వైట్ (37*), మెకంజీ(14*) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో విండీస్ ఇంకా 352 పరుగుల వెనుకంజలో ఉంది. ఓవర్ నైట్ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. మొదటి ఇన్నింగ్స్లో 438 పరుగులకు ఆలౌటైంది.
భారత్ ఆలౌటైన తర్వాతి బ్యాటింగ్కు దిగిన విండీస్కు ఓపెనర్లు బ్రాత్వైట్, త్యాగ్నారాయణ్ చందర్పాల్ (33) శుభారంభం అందించారు. ఆరంభంలో బ్రాత్వైట్ నిలకడగా ఆడాడు. తొలుత నెమ్మదిగా ఆడిన త్యాగ్నారాయణ్ తర్వాత బౌండరీలు బాదాడు. అశ్విన్ వేసిన వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అతడు.. సిరాజ్ బౌలింగ్లోనూ బంతిని రెండుసార్లు బౌండరీ దాటించాడు. కొద్దిసేపటికే జడేజా బౌలింగ్లో త్యాగ్నారాయణ్.. అశ్విన్కు చిక్కాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ ఓ సిక్స్, ఫోర్ బాదాడు. ఈ క్రమంలోనే రెండో రోజు ఆటను ముగించారు.
కోహ్లీ శతకం.. అశ్విన్ హాఫ్ సెంచరీ
87 పరుగుల వ్యక్తిగత స్కోర్తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (121; 206 బంతుల్లో 11 ఫోర్లు) శతకం బాదాడు. చూడముచ్చటైన స్క్వేర్ డ్రైవ్తో మూడంకెల స్కోరు (180 బంతుల్లో) అందుకున్న అతను.. తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. కోహ్లీ నాలుగున్నరేళ్లకు పైగా విరామం తర్వాత భారత్ అవతల శతకం సాధించాడు. కాసేపటికే మొదటి రోజు 36 పరుగులు చేసిన జడేజా (61; 152 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్.. వారికన్ వేసిన 99వ ఓవర్లో రనౌట్గా వెనుదిరిగాడు. స్ట్రైకింగ్లో ఉన్న కోహ్లీ.. సింగిల్కు ప్రయత్నించగా విండీస్ ఆటగాడు జోసెఫ్ నాన్స్ట్రైక్ ఎండ్లో వికెట్కు నేరుగా బంతిని విసిరడంతో పెవిలియన్ చేరాడు. కొద్దిసేపటికే కీమర్ రోచ్ బౌలింగ్లో జడేజా వికెట్ కీపర్ ది సిల్వాకి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ (56; 78 బంతుల్లో 8 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడి అర్ధ శతకం అందుకున్నాడు.
కోహ్లీ, జడేజా స్వల్ప వ్యవధిలో ఔటవడంతో అశ్విన్.. ఇషాన్ (25), ఉనద్కత్ (7)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తన తొలి టెస్టులో పెద్దగా ఆడే అవకాశం దక్కని ఇషాన్.. రెండో అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నట్లే కనిపించాడు. అయితే అతడి ఇన్నింగ్స్ను హోల్డర్ ముగించాడు. ఆ తర్వాత ఉనద్కత్, సిరాజ్ (0)లను స్పిన్నర్ వారికన్ పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో చకచకా కొన్ని షాట్లు ఆడి అర్ధశతకం పూర్తి చేసుకున్న అశ్విన్.. రోచ్ బౌలింగ్లో బౌల్డవడంతో ఇన్నింగ్స్కు తెరపడింది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వారికన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్ 2, గాబ్రియల్ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. -
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే విరాట్ కోహ్లీ(Virat Kohli).. ప్రత్యర్థి వికెట్ పడితే తనదైన శైలిలో సంబరాలు చేసుకుంటాడు. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. -
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
Bengaluru vs Delhi: కీలక మ్యాచ్లో బెంగళూరు చేతిలో దిల్లీ ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను దూరం చేసుకుంది. -
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
ధోనీ-రైనా జోడీ మైదానంలో చెన్నై అభిమానులకు కనువిందు చేసింది. -
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు