India vs Nepal : భారత్ vs నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. పరిస్థితి ఏంటి?
ఆసియా కప్(Asia Cup 2023)లోని మ్యాచ్లపై వరుణుడి ప్రభావం పడుతోంది. ఇప్పటికే భారత్ vs పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. నేడు నేపాల్తో జరిగే మ్యాచ్కూ వర్షం ముప్పు పొంచి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్ : ఆసియా కప్ (Asia Cup 2023 )లో ఇప్పటికే టీమ్ ఇండియా మ్యాచ్ ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు మరో మ్యాచ్పై వర్షం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 4 పరిస్థితి ఏంటి? అనే చర్చ మొదలైంది. నేపాల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే ఎవరు సూపర్-4లోకి అడుగుపెడతారు, ఆ లెక్కేంటో చూద్దాం.
చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మధ్య శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అప్పటికే నేపాల్పై ఘన విజయం సాధించిన పాక్.. సూపర్ 4లోకి అడుగుపెట్టింది. మరోవైపు సోమవారం అదే పల్లెకెలె వేదికగా నేపాల్తో భారత్ (India vs Nepal) మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్పై కూడా వరుణుడి ప్రభావం ఉండే అవకాశాలున్నట్లు వాతావారణ నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే మైదానం ఓవైపు అంతా మేఘావృతం అయింది.
ఒలింపిక్స్లో క్రికెట్ దూకుడు..!
నేపాల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయితే.. ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు టీమ్ఇండియా 2 పాయింట్లతో నేపాల్ కంటే ముందుంటుంది. దీంతో భారతే సూపర్ 4లోకి అడుగుపెడుతుంది. అప్పుడు గ్రూప్ A నుంచి భారత్, పాక్ సూపర్ 4కు చేరుకున్న జట్లుగా నిలుస్తాయి. ఒకవేళ నేపాల్ సూపర్ 4కు వెళ్లాలంటే.. భారత్పై తప్పక విజయాన్ని నమోదు చేయాలి. అలాగే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించకూడదు.
దీంతో మ్యాచ్ సజావుగా సాగాలని ఆ దేశం అభిమానులు కోరుకుంటున్నారు. అయితే.. పసికూన నేపాల్పై టీమ్ఇండియా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ జరిగి ఆ జట్టుపై ఘనవిజయం సాధించాలనే టీమ్ఇండియా కోరుకుంటోంది. నేపాల్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సంక్షిప్త వార్తలు
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.