Shashank Singh: వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్పై పంజాబ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తమది కాని మ్యాచ్లో కూడా పంజాబ్ విజయం సాధించిందంటే దానికి కారణం ఓ యువ బ్యాటర్. అతడే శశాంక్ సింగ్. తన సంచలన బ్యాటింగ్తో 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి 61 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ను గుజరాత్ నుంచి లాగేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి శశాంక్పై పడింది. ఎవరీ కుర్రాడు అంటూ వెతకడం మొదలు పెట్టారు.
నాటకీయ పరిణామాల మధ్య..
శశాంక్ సింగ్ పంజాబ్ జట్టులోకి చాలా నాటకీయ పరిణామాల మధ్య వచ్చాడు. అతడిని ఎంపిక చేసుకునే సమయంలో వేలంలో గందరగోళ పరిస్థితుల చోటుచేసుకున్నాయి. మొదట ఆ జట్టు అతడిని వద్దనుకుంది. శశాంక్ సింగ్ పేరు వేలంలోకి రాగానే కనీస ధర రూ.20 లక్షలకు అతణ్ని పంజాబ్ కొనుగోలు చేసింది. కానీ ఆ తర్వాత తాము తీసుకోవాలనుకున్న శశాంక్ అతడు కాదని, మరొకరని చెప్పింది. దీంతో వేలంలో కాస్త గందరగోళ పరిస్థితి తలెత్తింది. అప్పటికే వ్యాఖ్యాత వేలాన్ని ముగించడంతో పంజాబ్ అంగీకరించక తప్పలేదు. ఆ తర్వాత ‘‘మేం కొనాలనుకునే ఆటగాళ్ల జాబితాలో శశాంక్ ఉన్నాడు. ఇద్దరు ఆటగాళ్లు ఒకే పేరుతో ఉండటంతో గందరగోళం తలెత్తింది. సరైన శశాంక్ సింగే జట్టులోకి వచ్చాడు’’ అని స్వాగతం పలుకుతూ పంజాబ్ ఎక్స్లో పోస్టు చేసింది. దీనికి తగ్గట్టుగానే జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ అతడు అద్భుత బ్యాటింగ్తో చెలరేగిపోయాడు.
అప్పుడు శశాంక్ కెప్టెన్సీలో ధావన్..
పంజాబ్ జట్టు సారథిగా కొనసాగుతున్న శిఖర్ ధావన్ ఇటీవల శశాంక్ సింగ్ కెప్టెన్సీలో ఆడటం గమనార్హం. ఇటీవల ముంబయిలో జరిగిన డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో గ్రూప్ బి జట్టుకు శశాంక్ నాయకత్వం వహించాడు. అతడి కెప్టెన్సీలో దినేశ్ కార్తిక్, ఆయుష్ బదోనీలాంటి ఆటగాళ్లు ఆడారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. శిఖర్ ధావన్ కూడా అప్పుడు అతడి సారథ్యంలో ఆడటం విశేషం. ఇప్పుడు ఐపీఎల్కు వచ్చేసరికి ఇద్దరి పాత్రలు మారిపోయాయి. శిఖర్ కెప్టెన్సీలో శశాంక్ ఆడుతున్నాడు. డీవై పాటిల్ టోర్నమెంట్ సమయంలోనే శశాంక్ను ధావన్ చాలా దగ్గరగా గమనించాడు. అతడి ప్రతిభను గుర్తించి ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ నుంచే అవకాశం ఇస్తున్నాడు.
ఆ సిక్స్లు అద్భుతం..
శశాంక్ ఆటతీరును కెప్టెన్ ధావన్ మ్యాచ్ అనంతరం మెచ్చుకున్నాడు. ‘‘ఈ మ్యాచ్లో అతడు బాగా ఆడాడు. సిక్స్లు కొట్టిన తీరు అద్భుతం. పాజిటివ్ మైండ్సెట్తో ఆడుతున్నాడు’’ అని ధావన్ ప్రశంసించాడు.
దేశవాళీలో రాణిస్తూ..
శశాంక్.. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నాడు. ఎక్కువగా ముంబయి తరఫున ఆడాడు. క్రికెట్లో ఎదగడానికి మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రస్తుతం బీసీసీఐలో జనరల్ మేనేజర్ అభయ్ కురువిల్లా సాయం చేశాడు. శశాంక్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. 58 డొమెస్టిక్ టీ20లు ఆడిన శశాంక్.. 754 పరుగులు చేశాడు. ఈ ఆల్రౌండర్ జాతీయ స్థాయిలో ఛత్తీస్గఢ్కు ఆడుతుంటాడు. పంజాబ్ జట్టు కంటే ముందు సన్రైజర్స్కు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుముందు రాజస్థాన్, దిల్లీ జట్టులో కూడా సభ్యుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం