WTC 2023: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023.. 2025 ఫైనల్స్ వేదికలు ఖరారు
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఖరారు చేసింది. 2021-23 సీజన్కు సంబంధించిన...
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఖరారు చేసింది. 2021-23 సీజన్కు సంబంధించిన టెస్టు ఛాంపియన్షిప్ తుదిపోరు ఓవల్ వేదికగా జరగనుంది. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది. అలాగే 2025 సీజన్ ఫైనల్కు లార్డ్స్ వేదిక కానుంది. ‘‘ఐసీసీ వరల్డ్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) వేదికలను ఖరారు చేశాం. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ ఓవల్ మైదానంలో జరగనుంది. అలాగే లార్డ్స్ వేదికగా 2023-2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తాం’’ అని ఐసీసీ ప్రకటనలో వెల్లడించింది.
ఐసీసీ చీఫ్ జియోఫ్ అల్లార్డిస్ స్పందిస్తూ.. ‘‘ఐసీసీ ఛాంపియన్షిప్ తర్వాతి సీజన్ ఫైనల్ను ఓవల్లో నిర్వహించేందుకు ఆనందంగా ఉంది. అలాగే 2025 సీజన్ తుదిపోరుకు లార్డ్ వేదికగా నిలవనుంది. మొదటిసారి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌథాంప్టన్లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ను అభిమానులు భారీ సంఖ్యలో ఆస్వాదించారు. ఈసారి ఓవల్ వేదికగా జరిగే మ్యాచ్నూ వీక్షిస్తారని ఆశిస్తున్నా. మద్దతుగా నిలిచిన ఇంగ్లాండ్ క్రికెట్బోర్డు, మెరిల్బోన్ క్రికెట్ క్లబ్, సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్లకు ధన్యవాదాలు’’ అని ఐసీసీ చీఫ్ తెలిపారు.
తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్పై కివీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 2021-23 సీజన్లో ఆస్ట్రేలియా (70 శాతం) , దక్షిణాఫ్రికా (60 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక (53.33 శాతం), భారత్ (52.08 శాతం), పాకిస్థాన్ (51.85 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు 2023 జూన్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో తలపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరివో మూడు బెర్తులు?
ఐపీఎల్-17లో కోల్కతా నైట్రైడర్స్కు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
వర్షం వచ్చింది.. కథ ముగిసింది
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిణుకుమిణుకుమంటున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. -
థాయ్లాండ్ టైటిల్పై సాత్విక్ జోడీ గురి
పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. థాయ్లాండ్ ఓపెన్ ప్రపంచ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్పై గురిపెట్టారు. -
నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద, హంపి
భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, కోనేరు హంపి, వైశాలి నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీపడనున్నారు. -
నిఖత్, మీనాక్షి, అనామిక శుభారంభం
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (52 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) అనామిక (50 కేజీలు) శుభారంభం చేశారు. -
అదేం పెద్ద గొడవ కాదు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా మధ్య జరిగింది పెద్ద గొడవేం కాదని ఎల్ఎస్జీ సహాయ కోచ్ లాన్స్ క్లూసెనర్ అన్నాడు. -
వాళ్లు వెళ్లిపోతున్నారు
టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్తో జరిగే టీ20 సిరీస్ కోసం రావాల్సిందిగా ఈసీబీ ఆదేశించడంతో ఐపీఎల్-17లో ఆడుతున్న కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వదేశానికి బయల్దేరుతున్నారు. -
మహిళల షాట్పుట్లో అభా జాతీయ రికార్డు
జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మహిళల షాట్పుట్లో అభా ఖతువా జాతీయ రికార్డు నెలకొల్పింది. -
కుర్రాళ్లూ.. టెస్టు క్రికెట్ ఆడండి
యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడడంపై దృష్టి సారించాలని.. సుదీర్ఘ ఫార్మాట్లో రాణిస్తేనే అసలైన గౌరవం దక్కుతుందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. -
మెరిసిన ‘లక్ష్య’ శ్రీనివాస్
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ సత్తా చాటాడు. -
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
కెప్టెన్ కేఎల్ రాహుల్పై ఆ జట్టు యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై లఖ్నవూ టీమ్ స్పందించింది. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ ఎలా వస్తావో మేమూ చూస్తాం.. వంగా గీతను నిలదీసిన ఓటర్లు
-
పవన్కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు
-
భర్త మరణించినా.. ఓటు విలువ చాటిన భార్య
-
కేజ్రీవాల్ సహాయకుడు నాపై దాడి చేశారు
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!