Sunil Gavaskar: ఇప్పుడు మూడంటావు.. తర్వాత ఐదంటావు.. ! : రోహిత్పై గావస్కర్ అసహనం
WTC Finalను మూడు టెస్టుల సిరీస్గా ఆడాలన్న రోహిత్ శర్మ(Rohit Sharma) సూచనపై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) విమర్శలు గుప్పించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : WTC Finalలో భారత్ ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ పరాజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన సూచనలపై విమర్శలు వస్తున్నాయి. WTC Finalను మూడు టెస్టుల సిరీస్గా నిర్వహించాలని రోహిత్ కోరాడు. అయితే భారత సారథి వ్యాఖ్యలతో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ విభేదించాడు. ఇప్పుడు తాజాగా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) కూడా రోహిత్ సూచనపై విమర్శలు చేశాడు. ఇలాంటి పెద్ద ఈవెంట్లు ఆడేముందు ముందే మానసికంగా సిద్ధం కావాలని సూచించాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ..‘WTC Final కోసం మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడితే బాగుంటుంది. మేం ఎంతో కష్టపడ్డాం. పోరాడాం. కానీ ఫైనల్ కోసం ఒకే మ్యాచ్ ఆడాం. వచ్చే WTC సైకిల్లో మూడు టెస్టుల సిరీస్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను’ అని రోహిత్ అన్నాడు.
దీనిపై గావస్కర్ స్పందిస్తూ..‘ఇది సరైంది కాదు. చాలా కాలం క్రితమే దీన్ని నిర్ణయించారు. WTC సైకిల్లో తొలి మ్యాచ్ ఆడటానికి ముందే ఫైనల్కు ఒకే మ్యాచ్ అన్న విషయం మీకు తెలుసు. అలాంటప్పుడు.. మానసికంగా సిద్ధం కావాల్సిందే’ అని స్పష్టం చేశాడు.
‘ఐపీఎల్(IPL)కు ఎలా సిద్ధమవుతారో దీనికి అలానే సిద్ధం కావాలి. అక్కడ మీరు బెస్ట్ ఆఫ్ త్రీ అని చెప్పరు. ప్రతి ఒక్కరికి చెడ్డ రోజులు ఉంటాయి. డబ్ల్యూటీసీ సైకిల్లో తొలి బంతిని ఎదుర్కొన్నప్పుడే మీకు ఈ విషయం తెలుసు. దీంతో బెస్ట్ ఆఫ్ త్రీ అడగలేరు. రేపు.. మీరు బెస్ట్ ఆఫ్ ఫైవ్ అని కూడా అడుగుతారేమో’ అంటూ గావస్కర్ విమర్శించాడు.
ఇక రోహిత్ సూచనను వ్యతిరేకించాడు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్. ‘ఈ సూచన బాగానే ఉంది. అయితే.. మీకు 50-మ్యాచ్ సిరీస్ ఉంటుంది. కానీ.. ఒలింపిక్స్లో బంగారు పతకం గెలుచుకోవడం కోసం ఒకే రేసు నిర్వహిస్తారు. అదే ఆటంటే’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ద్వైపాక్షిక సిరీస్ల్లో గెలవడం కాదు..
ఇక WTC Finalలో టీమ్ఇండియా ఆటతీరుపై గావస్కర్ మండిపడ్డాడు. ద్వైపాక్షిక సిరీస్ల్లో రాణించడం కాదని.. మెగా టోర్నీల్లో ఆస్ట్రేలియాలాంటి జట్లపై గెలవాలని పేర్కొన్నాడు. ‘మనకు వెస్టిండీస్తో మ్యాచ్లు ఉన్నాయి. వెస్టిండీస్ ప్రస్తుతం ఉత్తమమైన జట్టు కాదు. మీరు అక్కడికి వెళ్లి ఆ జట్టుపై 2-0, 3-0 తేడాతో విజయాలు సాధిస్తారు. అదేం పెద్ద విషయం కాదు కదా. మీరు ఫైనల్స్ వరకు వెళ్లి మళ్లీ ఆస్ట్రేలియాతోనే ఆడి.. అవే తప్పులు చేస్తే.. ఎప్పుడు ట్రోఫీని గెలుస్తారు?’ అని గావస్కర్ ప్రశ్నించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. -
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
Bengaluru vs Delhi: కీలక మ్యాచ్లో బెంగళూరు చేతిలో దిల్లీ ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను దూరం చేసుకుంది. -
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
ధోనీ-రైనా జోడీ మైదానంలో చెన్నై అభిమానులకు కనువిందు చేసింది. -
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
-
స్వాతీమాలీవాల్పై దాడి..! దిల్లీ సీఎం నివాసం బాక్సింగ్ రింగ్లా మారిందన్న భాజపా
-
‘దుమ్మురేపిన’ గాలివాన.. ముంబయిలో మెట్రో, సబ్అర్బన్ సర్వీసులకు అంతరాయం
-
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
-
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’