Revanth Reddy: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి.. కెనడా హైకమిషనర్‌ను కోరిన సీఎం రేవంత్‌రెడ్డి

Eenadu icon
By Telangana News Team Published : 01 Nov 2025 16:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కెనడా హైకమిషనర్‌ క్రిస్టోఫర్‌ కూటర్‌ బృందం భేటీ అయింది. ఐటీ, ఫార్మా, ఏరో స్పేస్‌, డిఫెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో కెనడాతో భాగస్వామ్యంపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కెనడా హై కమిషనర్‌కు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌ పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందం భేటీ అయింది. హైదరాబాద్‌లో అమలవుతున్న ఫ్రాన్స్ ప్రాజెక్టులపై ఈ సందర్భంగా చర్చించారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని సీఎం కోరారు. హైదరాబాద్‌లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు