RTC bus Reservation: గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ బస్ రిజర్వేషన్!
త్వరలో అందుబాటులోకి

ఈనాడు, హైదరాబాద్: బస్సు టికెట్ రిజర్వేషన్, ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆర్టీసీ వెబ్సైట్, లేదంటే బస్టాండ్లలో కౌంటర్ల నుంచి ఆన్లైన్లో టికెట్లు రిజర్వు చేసుకోవాల్సి ఉంది. త్వరలో గూగూల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవడంతోపాటు.. అప్పటికప్పుడే రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంస్థ సిద్ధమవుతోంది. అమల్లోకి వస్తే..మొబైల్ ఫోన్లో ‘గూగుల్ మ్యాప్స్’లోకి వెళ్లి, ఏ ఊరికి వెళ్లాలనే వివరాలు నమోదుచేసి, ఎక్కాల్సిన బస్సును ఎంచుకుని..డబ్బులు చెల్లిస్తే చాలు..అప్పటికప్పుడు రిజర్వేషన్ ఖరారవుతుంది. మొబైల్కే ఈ-టికెట్ వచ్చేస్తుంది. రిజర్వేషన్ ఉన్న బస్సులకే కాకుండా.. రిజర్వేషన్ లేని బస్సుల్లోనూ టికెట్లను ఇదే విధానంలో తీసుకుని, ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
బస్సుల సమాచారం గూగుల్కు
తెలంగాణ పరిధిలో తిరిగే బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసుల వివరాలను గూగుల్కు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం జాబితా సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల సమాచారాన్ని ఐటీ శాఖ ద్వారా గూగుల్కు కొద్దిరోజుల క్రితం అందించినట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం. గూగుల్స్ మ్యాప్స్లో ప్రస్తుతం టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా..రెండు, మూడు వారాల తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. తొలుత హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం అందుబాటులోకి వచ్చాక, జిల్లా బస్సుల వివరాలనూ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం.
కార్డు చూపగానే.. టికెట్..
బస్సెక్కిన తర్వాత క్రెడిట్, డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసి టికెట్ తీసుకునే సదుపాయం ఇప్పుడు అమల్లో ఉంది. ఈ విధానంలో కార్డుదారు..పిన్ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. సిటీ బస్సులు లేదా దూరప్రాంత బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులున్నప్పుడు టికెట్ జారీకి ఎక్కువ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో పిన్ నంబరు నమోదుచేయాల్సిన అవసరం లేకుండా క్రెడిట్, డెబిట్ కార్డును..టిమ్ యంత్రంపై పెట్టగానే నగదు చెల్లింపు జరిగి, టికెట్ జారీఅయ్యే విధానం తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది. వారంలోగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. తొలుత హైదరాబాద్లో ఎయిర్పోర్టుకు వెళ్లే ఏసీ బస్సుల్లో అమలుచేయనున్నట్లు సమాచారం. తర్వాత సిటీ బస్సులు, దూరప్రాంత బస్సుల్లో అందుబాటులోకి రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

జూబ్లీ‘త్రి’ల్స్
జూబ్లీహిల్స్... ఈ ఉప ఎన్నికలో గెలుపు.. మరెన్నో మలుపులకు మూలం కావొచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. - 
                                    
                                        

100 మంది ఓటర్లకో నేత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతి వందమంది ఓటర్ల బాధ్యతను ఒక్కో నేతకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. - 
                                    
                                        

పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు
హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చేశాయని, ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. - 
                                    
                                        

చదువులో వెనకబాటుకు పిల్లల్ని నిందించలేం
చదువులో కొంత వెనకబడగానే ఆ పిల్లలకు ఆసక్తి లేదని... చదువు రాదని... ఒక ముద్ర వేసి... వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు... అలాంటి వారికి మరికొంత సమయం కేటాయిస్తే మిగిలిన వారితో సమానంగా రాణిస్తారని చెబుతున్నారు దిల్లీ విశ్వవిద్యాలయం విద్యా విభాగం మాజీ డీన్, విద్యావేత్త ఆచార్య అనితా రాంపాల్. - 
                                    
                                        

ఆయిల్పాం దిగుమతి శాతంలో తెలంగాణ హవా!
ఈ ఏడాది భారీ వర్షాలతో చాలా పంటలు దెబ్బతిన్నా ఆయిల్పాం మాత్రం బలంగా నిలిచింది. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఓఈఆర్ (నూనె దిగుమతి శాతం) నమోదుతో తెలంగాణ రికార్డు సృష్టిస్తోంది. - 
                                    
                                        

అభివృద్ధికి దూరం.. గుర్తింపు కోసం ఆరాటం
ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వలస వచ్చిన గొత్తికోయల జీవనం దుర్భరంగా తయారైంది. - 
                                    
                                        

సైబర్ నేరాల నియంత్రణకు కవచం
రోజురోజుకీ తీవ్రమవుతున్న సైబర్ నేరాలను నియంత్రించేందుకు సరికొత్త కవచం అందుబాటులోకి రాబోతోంది. - 
                                    
                                        

మైస్ టూరిజం 2.0
విదేశీ, ఇతర రాష్ట్రాల పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా మైస్ టూరిజంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. - 
                                    
                                        

ఔషధాల వివరాలన్నీ క్యూఆర్ కోడ్లో...
రాష్ట్రంలోని సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.500 కోట్ల విలువైన ఔషధాలను కొనుగోలు చేస్తుండగా... ఏటా పెద్దమొత్తంలో మందులు గడువు తీరి వృథా అవుతున్నాయి. - 
                                    
                                        

కేసుల పరిష్కారానికే మధ్యవర్తిత్వం
కోర్టుల్లో విపరీతంగా పెరుగుతున్న కేసులను తగ్గించేందుకు ‘మధ్యవర్తిత్వం’ దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర హైకోర్టు మీడియేషన్- ఆర్బిట్రేషన్ సెంటర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. - 
                                    
                                        

ప్రిన్సిపల్ వేధిస్తున్నారని విద్యార్థినుల ఆందోళన
ప్రిన్సిపల్ వేధింపులకు పాల్పడుతున్నారని.. ఆమెను విధుల నుంచి తొలగించాలంటూ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆదివారం ఆందోళనకు దిగారు. - 
                                    
                                        

గోల్ఫ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణం: మంత్రి జూపల్లి
అంతర్జాతీయ గోల్ఫ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తెలంగాణకు రావడం గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. - 
                                    
                                        

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు డిసెంబరు 9లోపు నెరవేర్చాలి: శ్రీపాల్రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న సందర్భంగా... మ్యానిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను డిసెంబరు 9లోపు అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. - 
                                    
                                        

సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగ్
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులు తమ సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగ్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని... నెలవారీ బిల్లు పెరగకుండా పొదుపు పాటించడానికి అవకాశం ఏర్పడుతుందని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. - 
                                    
                                        

ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే
నిపుణుల సూచనల మేరకు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తల ఆమోదం మేరకు ‘హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. - 
                                    
                                        

నీరు లేక.. పరిశోధనలు సాగక
దోమల నియంత్రణపై పరిశోధనలు కొనసాగించే హైదరాబాద్ బేగంపేటలోని సుప్రసిద్ధ సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీకి ఏళ్లుగా నీటి సమస్య తీరడం లేదు. - 
                                    
                                        

భూగర్భ జలాలు గలగల..
కుంభవృష్టి వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి అక్టోబరు వరకు రాష్ట్ర సాధారణ వర్షం 831 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 1,164 మి.మీ. కురిసింది. - 
                                    
                                        

సర్వీసులో ఉంటూనే ధ్రువపత్రాలు అద్దెకు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేస్తూనే వందల మంది తమ ధ్రువపత్రాలను ప్రయివేటు ఔషధ దుకాణాలకు అద్దెకు ఇచ్చిన వ్యవహారం వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపుతోంది. - 
                                    
                                        

రహదారి మధ్యలో బిందు సేద్యం
కరీంనగర్ నుంచి వరంగల్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 563లో విభాగిని (డివైడర్) మధ్యలో నాటిన మొక్కలకు బిందు సేద్యం ద్వారా నిత్యం నీరందించేందుకు ప్రతి కిలో మీటరుకు 5 వేల లీటర్ల సామర్థ్యం గల రెండు ప్లాస్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. - 
                                    
                                        

10 నెలల చిన్నారి ఇంటిని తీసుకొచ్చింది
పది నెలల చిన్నారి హన్సికను లక్కీడ్రా వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధి గణేశ్నగర్లో రూ.16 లక్షల విలువైన 66 గజాల స్థలం, అందులో నిర్మించిన ఇంటిని రూ.500కే ఈ చిన్నారి సొంతం చేసుకుంది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్లలో లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
 - 
                        
                            

బాపట్ల జిల్లాలో కారు, లారీ ఢీ.. నలుగురు మృతి
 - 
                        
                            

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్కు రిమాండ్
 - 
                        
                            

రూ.25 లక్షల చికిత్స... నిమ్స్లో ఉచితం!
 - 
                        
                            

ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ
 - 
                        
                            

విజయవాడ ఆస్పత్రి వద్ద జోగి రమేశ్ అనుచరుల హంగామా
 


