Hyderabad: గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలి: రామచందర్‌రావు

Eenadu icon
By Telangana News Team Published : 25 Nov 2025 13:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురు తేజ్ బహదూర్ 350వ వర్థంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ.. గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలన్నారు. ‘‘దేశానికే శ్రీగురు తేజ్ బహదూర్ మార్గదర్శి. భాజపా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయదు. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించి జయంతి, వర్ధంతులు నిర్వహిస్తున్నాం’’ అని రామచందర్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని