Revanth Reddy: మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

Eenadu icon
By Telangana News Team Updated : 03 Sep 2025 15:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి నేతలను ప్రజలు తిరస్కరించారని, అలాంటి వారి వెనుక తాను ఎందుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత.. హరీశ్‌రావు వెనుకాల రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఉన్నారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలపై సీఎం తాజాగా స్పందించారు. 

‘‘నేను కవిత వెనుకున్నాను అని కొందరు అంటున్నారు. హరీశ్‌రావు, సంతోష్‌ వెనుక ఉన్నానని మరికొందరు అంటున్నారు. నేను ఎవరి వెనుకా లేను. ఇప్పటికే ప్రజలు వాళ్లను తిరస్కరించారు. అలాంటి వారితో కలిసే సమయం నాకు లేదు. ప్రజల వెంట మాత్రమే ఉంటాను. మీ కుల, కుటుంబ పంచాయితీల మధ్య మమ్మల్ని తీసుకురావొద్దు’’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


Tags :
Published : 03 Sep 2025 15:08 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు