Bandi Sanjay: చెక్‌ డ్యామ్‌లపై విజిలెన్స్‌ విచారణ ఏమైంది?: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్‌ బహిరంగ లేఖ

Eenadu icon
By Telangana News Team Published : 25 Nov 2025 15:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: తెలంగాణలో చెక్‌ డ్యామ్‌లు కూలిపోవడంపై అనుమానాలున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మనేరు నదిపై కట్టిన చెక్‌ డ్యామ్‌లు కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనుగుల-గుంపుల వద్ద చెక్‌ డ్యామ్‌ కూలడమే ఇందుకు నిదర్శనమన్నారు. 

‘‘భారత రాష్ట్ర సమితి పాలనతో కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికొదిలేయడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. గత ప్రభుత్వం హయాంలో చెక్‌ డ్యామ్‌లను నిర్మించిన కాంట్రాక్టర్లు కాంగ్రెస్‌ వాళ్లే. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం, నిధుల చెల్లింపులపై మీరు ఆదేశించిన విజిలెన్స్‌ విచారణ ఏమైంది? ఆనాడు బాధ్యులపై చర్యలు తీసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉంటే తనుగుల-గుంపుల చెక్‌ డ్యామ్‌ కూలేది కాదు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్‌, భారత రాష్ట్ర సమితి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ డ్రామాలాడుతున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాల్లో అక్రమాలు, కూలిపోవడంపై విచారణ జరిపించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, వారి ఆస్తులు జప్తు చేసి ఆ సొమ్ముతోనే మళ్లీ డ్యామ్‌లు నిర్మించాలి’’ అని బండి సంజయ్‌ లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని