సైనిక సంస్కరణలకు శరాఘాతం!
భారత తొలి త్రిదళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్- సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మరణంతో దేశంలో సైనిక సంస్కరణల ప్రక్రియకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. త్రివిధ దళాల పోరాట సామర్థ్యానికి మరింత వన్నెలద్దేందుకు, వనరుల సమర్థ వినియోగానికి ఉద్దేశించిన ‘థియేటరైజేషన్’ ప్రణాళిక ఆయన ఆధ్వర్యంలోనే సిద్ధమవుతోంది
రావత్ మరణంతో ఉమ్మడి విభాగాల ఏర్పాటుకు ఎదురుదెబ్బ
దిల్లీ: భారత తొలి త్రిదళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్- సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మరణంతో దేశంలో సైనిక సంస్కరణల ప్రక్రియకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. త్రివిధ దళాల పోరాట సామర్థ్యానికి మరింత వన్నెలద్దేందుకు, వనరుల సమర్థ వినియోగానికి ఉద్దేశించిన ‘థియేటరైజేషన్’ ప్రణాళిక ఆయన ఆధ్వర్యంలోనే సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాప సందేశం కూడా దీనికి దర్పణం పడుతోంది. తొలి సీడీఎస్ హోదాలో రక్షణ సంస్కరణలు సహా విభిన్న అంశాలపై రావత్ కసరత్తు చేశారని ఆయన కొనియాడారు. దాదాపు రెండేళ్ల కిందట దేశ తొలి త్రిదళాధిపతిగా రావత్ బాధ్యతలు చేపట్టారు. ఈ హోదా ప్రధాన ఉద్దేశం.. సైన్యం, నౌకాదళం, వాయుసేనలతో ఉమ్మడి విభాగాల (థియేటర్ కమాండ్స్)ను ఏర్పాటు చేయడం. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద సైనిక సంస్కరణ కానుంది.
సంక్లిష్ట సమయంలో బాధ్యతలు..
సంస్కరణలు, థియేటరైజేషన్ దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్న తరుణంలో ఆయన సీడీఎస్గా నియమితులయ్యారు. కొవిడ్-19 మహమ్మారి, ఇతర అంశాల కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ దెబ్బతినడం, అదే సమయంలో సరిహద్దుల్లో చైనా దూకుడు పెంచడం వంటి అంశాల నేపథ్యంలో.. ప్రభుత్వం కేటాయించిన కొద్దిపాటి నిధులతో సైనిక ఆధునికీకరణ, ఇతర అంశాలకు మధ్య సమతౌల్యం చేసుకోవడం త్రిదళాధిపతికి కత్తిమీద సామైంది.
* తన విధి నిర్వహణలో అత్యంత సంక్లిష్ట పరిస్థితులను రావత్ ఎదుర్కొన్నారు. 2017 జూన్లో ఆయన సైన్యాధిపతిగా ఉన్న సమయంలోనే చైనా సైన్యంతో ఏర్పడిన డోక్లామ్ ప్రతిష్టంభనను సమర్థంగా ఎదుర్కొన్నారు.
* బుర్హాన్ వాని అనే ఉగ్రవాది హతంతో జమ్మూ-కశ్మీర్లో అశాంతి ప్రజ్వరిల్లగా, అక్కడి ముష్కరులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదీ రావత్ హయాంలోనే.
సీనియర్లను తోసిరాజని..
సైన్యంలో రావత్ ఎదుగుదల శరవేగంగా జరిగింది. సీనియార్టీలో ముందున్న లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షి, లెఫ్టినెంట్ జనరల్ పీఎం హరీజ్లను తోసిరాజని మోదీ ప్రభుత్వం ఆయనను ఆర్మీ చీఫ్గా ఎంపిక చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
తల్లితో కలిసి నేడు పిఠాపురానికి రామ్చరణ్
అగ్ర నటుడు చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్చరణ్ శనివారం పిఠాపురం రానున్నారు. -
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం సీఎం జగన్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడి అవసరాల కోసం రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ వాహనాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. -
‘మూడు కోట్ల ఎకరాలకు’ బీమా ఎగ్గొట్టారు
పంట వేస్తే చాలు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని నమ్మిన రైతుల్ని జగన్ నిలువెల్లా మోసం చేశారు. -
ఆసుపత్రులు ఆగం.. తగ్గేదెలా రోగం?
పదే పదే ప్రచారం చేసి లేనిది ఉన్నట్లు నమ్మించే గోబెల్స్ ప్రచారంలో జగన్ ముందుంటారు. ఏమీ చేయకున్నా చేసినట్లు చెబుతూ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఆయన దిట్ట. -
విద్యుత్ ఛార్జీల భారం కావాలా.. ఇంటింటా వెలుగులు కావాలా?
తెదేపా హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీల భారం పడింది. మేము అధికారంలోకి వచ్చాక ఆ భారాన్ని తగ్గిస్తాం’ అంటూ మైకు పట్టుకుని కొడుతూ డబ్ డబ్ (గుండె చప్పుడును తలపించేలా శబ్దం).. చెప్పిన వ్యక్తి గుర్తుకు వచ్చారా? రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో సామాన్య విద్యుత్ వినియోగదారుడిపై శ్లాబ్ వారీగా గరిష్ఠంగా 40శాతం ఛార్జీలు పెరిగాయి. దీంతో పేదలే కాదు.. ధనికులూ విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు. -
అరాచకపాలనలో అందరూ బాధితులే..!
అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో వేధింపులు.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే ఇళ్లపై అర్ధరాత్రి బందిపోటుల్లా దాడులు.. వైకాపా రాజ్యాంగం అమలు చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి జైల్లో పడేయడం.. ఈ ఐదేళ్లల్లో జగన్ సాగించిన దమనకాండను ‘టీం స్వేచ్ఛ’ కళ్లకు కట్టినట్లు గణాంకాలతో వెల్లడించింది. -
ఏసీఏలో కోట్ల రూపాయల దుర్వినియోగం
‘ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తోంది. కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తోంది. -
వివేకా కుమార్తె సునీత, అల్లుడు, సీబీఐ ఎస్పీ వ్యాజ్యాల కొట్టివేత
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. -
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఎన్నికల నిఘా వేదిక పరిశీలకులు జీవీ కృష్ణారావు అన్నారు. -
ఆ 15 రోజులు ఎప్పటికి వచ్చేనో?
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమంటూ జగన్ డప్పు కొట్టుకుంటారు. తాను వచ్చాకే సంక్షేమ పథకాలను కొత్తగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లుగా బూరలు ఊదుతారు. -
ఉద్యాన రైతుకు.. ఉరి!
రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు గత తెదేపా ప్రభుత్వం అండగా నిలిచింది. పూలు, పండ్లు, కూరగాయల సాగే లాభదాయకం అన్న భావన కలిగించింది. -
తుడా.. నుడా.. అనుడా.. దోచేయ్ ఎడాపెడా!
జగన్ ఏలుబడిలో వైకాపా నేతలు కొన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇంకొన్నింటిని తమ వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. వాటిలో పట్టణాభివృద్ధి సంస్థలు ప్రధానమైనవి. -
పేదల గొంతెండబెట్టిన జగన్!
జనానికి గుక్కెడు నీరిచ్చే.. జలజీవన్ మిషన్ (జేజేఎం) పనులకూ సహకరించని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్రెడ్డే. -
ఈ చదువులు మాకొద్దు ‘మామా’
జగన్ పాలనలో యువత ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ చదువులు మాకొద్దంటూ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఉన్నత విద్యలో నాణ్యత లేకపోవడం.. విద్యా సంస్థలను రాజకీయాలకు నిలయాలుగా మార్చేయడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోంది. -
ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయండి
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
సుప్రీంకూ అబద్ధాలేనా?
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేలా ఉంది గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి తీరు. -
పోస్టల్ బ్యాలట్ను 12 వరకు పొడిగించాలి
పోస్టల్ బ్యాలట్ ప్రక్రియను ఈనెల 12 వరకు పొడిగించాలని సీఈవోను పలువురు తెదేపా నేతలు.. ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావులు.. ఐక్యవేదిక కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి బాజీ పఠాన్, షేక్ అబ్దుల్ రజాక్లు కోరారు. -
బీరాలు పలికి.. బేరానికొచ్చి!
వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా’పై జగన్ చెలరేగిపోయారు. కేంద్రంపై రంకెలు వేశారు. ఉద్రేకపూరిత ప్రసంగాలతో ఊగిపోయారు. వైకాపా నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టి బంద్లు చేయించారు. -
ఆ దేవతే లేకపోతే..
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంసకర నిర్ణయాలకు, అడ్డగోలు పనులకు హైకోర్టు కర్రుకాల్చి వాతపెట్టిన సందర్భాలు అనేకం. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలే చాలాసార్లు బాధితులకు రక్షణగా నిలిచాయి. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!